Bandi Sanjay: ఫస్ట్ కు జీతాలు ఇవ్వలేరు కానీ.. మళ్లీ అధికారిమా..! కేసీఆర్ పై బండి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: ఫస్ట్ కు జీతాలే ఇవ్వలేని కేసీఆర్ కు మళ్లీ అధికారిమిస్తే అంతే సంగతులు అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లది కబ్జాల ఆరాటం…. తనది పేదల పోరాటం అన్నారు. ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోండి అని కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ పిలుపు నిచ్చారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మంత్రి గంగుల కమలాకర్ను టార్గెట్ చేశారు. అబద్దాలు, మోసాలు, భూకబ్జాల్లో గంగుల, పురమళ్ల నెంబర్ వన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బియ్యం టెండర్లలో రూ.1300 కోట్ల గోల్ మాల్ చేసిన గంగుల అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇంట్లో 5 గురికి పదవులున్నయ్ అని మండిపడ్డారు.
నిరుద్యోగులు ఏం పాపం చేశారు? ఇంటికో ఉద్యోగం ఏమైంది? అని ప్రశ్నించారు. ఫస్ట్ కు జీతాలే ఇవ్వలేని కేసీఆర్ కు మళ్లీ అధికారిమిస్తే అంతే సంగతులు అంటూ ధ్వజమెత్తారు. కరీంనగర్ నియోజకవర్గంలోని జూబ్లీనగర్, ఫకీర్ పేటలో బండి సంజయ్ ప్రచారంలో మాట్లాడుతూ.. గంగుల కమలాకర్ కు 2 సార్లు అధికారమిస్తే భూములు కొల్లగొట్టిండు… గుట్టలనే ధ్వంసం చేసిండని మండిపడ్డారు. ఇప్పుడు పొరపాటున మళ్లీ గెలిపిస్తే ఈసారి ఏకంగా మీ ఇండ్లను కొట్టేయడం ఖాయమన్నారు. గంగుల తోపాటు కాంగ్రెస్ అభ్యర్ధి భూకబ్జాల పంచాయతీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ, నాది పేదల కోసం ఎంతకైనా తెగించే నైజమన్నారు. ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోవాలని ప్రజలను కోరారు.
Also Read
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
ముస్లిం ఓట్ల కోసం మసీదులకు వెళ్లి నమాజ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. హనుమాన్ చాలీసాను ఉత్సాహంగా చదివే ధైర్యం ఒవైసీకి ఉందా? ఖైదీ సంజయ్ అడిగాడు. బండి సంజయ్ ఆరోపణలపై మంత్రి గంగుల కమలాకర్ ఘాటుగా స్పందించారు. అవినీతి, అక్రమాల కారణంగా ఆయనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని ఖైదీ సంజయ్ డబ్బులు తీసుకున్నాడని, అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. మతం పేరుతో ఎంత రెచ్చగొట్టినా బీజేపీకి ఓట్లు పడవు. హిందుత్వ ఓటు బ్యాంకు కోసం బండి సంజయ్, సెక్యులర్ నినాదాలతో ప్రజల్లోకి వెళ్తున్న మంత్రి గంగుల ఎలా ఉంటారో చూడాలి. ఓటింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇద్దరు నేతల మధ్య ఎన్నికల పోరు ఎంత రసవత్తరంగా ఉంటుందనే దానిపై కరీంనగర్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
World Largest Bell: ప్రపంచంలోనే అతి పెద్ద గంటను ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి
తాజావార్తలు
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!