NTV Telugu Site icon

Balka Suman: రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది.. మాజీ ఎమ్మెల్యే

Balka Suman

Balka Suman

Balka Suman: తాజాగా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ చేపట్టారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని., ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ కుటుంబ పాలన నడుస్తోందని., ముఖ్యమంత్రి రేవంత్ తన సోదరులను తెలంగాణ మీదకు వదిలేశాడని., రేవంత్ సోదరులకు ఏ పదవులు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాక్షాత్తూ అసెంబ్లీ కమిటీ హల్ లో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదా లేకున్నా స్పీకర్ దగ్గర వికారాబాద్ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారని ఆయన చెప్పుకొచ్చారు. కొడంగల్ లో తిరుపతి రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులను పంచుతుంటే మా జెడ్పిటీస్ మహిపాల్ అడ్డుకున్నారని., రేవంత్ మరో సోదరుడు కొండల్ రెడ్డి కి ఏ హోదా ఉందని అధికారులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారని., ఆయనకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తోడుగా ఉన్నారంటూ ఆయన తెలిపారు.

Bangladesh Violence: బంగ్లాదేశ్ నుంచి రాయబార అధికారులను ఖాళీ చేయించిన భారత్..

కొండల్ రెడ్డి కాన్వాయ్ లో పదుల సంఖ్యలో వాహనాలు ఉంటాయి.. వారికి అధికారులు రాచ మర్యాదలు చేస్తారు. రేవంత్ అమెరికా పర్యటనలో స్వచ్ బయోతో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని., ఆ కంపెనీ రేవంత్ మరో సోదరుడు ఎనుముల జగదీశ్ రెడ్డి దని., పదిహేను రోజుల క్రితమే ఆ కంపెనీ ఏర్పాటయ్యిందని., ఇవే కాకుండా రేవంత్ సోదరుల ఆద్వర్యంలో నాలుగు సంస్థలు ఏర్పాటు అయ్యాయని., ఈ సంస్థల ద్వారానే రేవంత్ బ్లాక్ మనీని వైట్ గా మారుస్తున్నట్లు ఆయన అన్నారు. రేవంత్ సోదరులు అనేక మైక్రో సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నారని., రేవంత్ సోదరులు రియల్టర్లను బెదిరించి విచ్చల విడిగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి శాశ్వత సీఎం కాదు.. ఇలాంటి బోగస్ పనులు మానుకోవాలి., బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని తెలంగాణ అంటే ఇష్టం లేని వాళ్ళే ప్రచారం చేస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు.