నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ అంటేనే మాస్ జాతర. ‘వీరసింహా రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న NBK111 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించాలని భావించారు. అయితే, ప్రస్తుత మార్కెట్ లెక్కలు మరియు బడ్జెట్ సమీకరణాల దృష్ట్యా, ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి బాలయ్య ఇమేజ్కు సరిపోయే పక్కా “ఫ్యామిలీ ఎమోషన్స్ & పవర్ ఫుల్ యాక్షన్” కథను గోపీచంద్ మలినేని సిద్ధం చేశారు. బాలయ్య మార్కు యాక్షన్ తో పాటు ప్రతి ఒక్కరినీ కదిలించే ఎమోషన్స్ టచ్ కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
దర్శకుడు గోపీచంద్ మలినేని గత కొద్దిరోజులుగా వైజాగ్లో ఉండి ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ‘వన్-లైన్ ఆర్డర్’ ఫైనల్ చేయడంతో కథపై పూర్తి స్పష్టత వచ్చేసింది. ఈ పనులన్నీ పూర్తి చేసుకున్న దర్శకుడు ఈరోజే హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్కడ బాలయ్యను కలిసి పూర్తి స్థాయి నెరేషన్ ఇచ్చే అవకాశం ఉంది. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం బాలయ్య పలు కథలు వైన్ పనిలో ఉన్నారు. ఇటీవల మళయాళ దర్శకుడు హనీఫ్ అదేని, టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయా కథలు వినిపించారు. ఇక వీరసింహ రెడ్డితో మెప్పించిన గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ను వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.
