Credit Card: క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. ఇకపై అదనపు ఛార్జీలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రెడిట్ కార్డు జారీ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. క్రెడిట్ కార్డు వినియోగదారులకు బ్యాడ్ న్యూ్స్ చెప్పాయి. ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై మాత్రమే అదనపు రుసుము వసూలు చేసిన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇకపై ఇతర యుటిలిటీ బిల్లులు కూడా దాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి. విద్యుత్తు, ఫోన్, గ్యాస్, ఇంటి అద్దె క్రెడిట్ కార్డుతో చెల్లిస్తుంటాం. ఇలా చెల్లిస్తే ఒకప్పుడు రివార్డులు వచ్చేవి. కాని ఇకపై పరిస్థితి మారనుంది. అప్పటికే అద్దెపై సేవా రుసుము వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇతర బిల్లులకు సైతం వాటిని విస్తరించేందుకు కొన్ని బ్యాంకులు సిద్ధమయ్యాయి. దీంతో వినియోగదారులకు అదనపు భారం పడనుంది. ఆ బ్యాంకులు ఏ వంటే..ఎస్ బ్యాంకు, ఐడీఎఫ్ సీ బ్యాంకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
మే 1 నుంచి క్రెడిట్ కార్డులతో చెల్లించే బిల్లులపై 1 శాతం రుసుము వసూలు చేయనున్నాయి. ఒకవేళ 1,500 రూపాయలు గ్యాస్ బిల్లు చెల్లిస్తే.. రూ. 15 రుసుము అదనంగా పడుతోందన్న మాట. ఇది అందరికీ వర్తించదని బ్యాంకులు తెలిపాయి. ఎస్ బ్యాంకులో అయితే నెల వారీ యుటిలిటీ బిల్లులు రూ.15,000 దాటితేనే ఒక శాతం అదనపు రుసుము వర్తింపజేస్తుంది. అంటే 15 వేల రూపాయలు దాటితేనే అదనపు భారం పడుతుందన్న మాట. క్రమంగా ఎన్ని సార్లు చెల్లిస్తే అన్ని సార్లు రుసుము చెల్లించాల్సిందే. ఐడీఎఫ్ సీ బ్యాంకు పరిమితి రూ. 20వేలుగా ప్రకటించింది. క్రెడిట్ కార్డు లావాదేవీలపై పేమెంట్ గేట్వేలు వ్యాపార సంస్థల నుంచి వసూలు చేసే ఛార్జీలు “మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) అంటారు. కేటగిరీని బట్టి ఇది మారుతుంది. ఉదాహరణకు నిత్యావసరాలకు, ట్రావెల్ తదితరాలకు వేర్వేరుగా ఉంటుంది. కాని యుటిలిటీ బిల్లుల చెల్లింపులపై ఎండీఆర్ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో బ్యాంకులకు తక్కువ ఆదాయం సమకూరుతుంది. కొంత మంది వ్యాపార అవసరాల కోసం క్రెడిట్ కార్డులు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా క్రెడిట్ లిమిట్ తో పోలిస్తే.. యుటిలిటీ బిల్లుల మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. కొందరు దీన్ని ఆసరాగా తీసుకుని వ్యాపార అవసరాలను కూడా యుటిలిటీ బిల్లుల కింద చూపి ప్రయోజనం పొందుతున్నారు. అదనపు రుసుము విధించడంతో దాన్ని కూడా నివారించవచ్చని ఆయా బ్యాంకులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.
- Tags
- Credit Card users
- idfc
- ys bank
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!