Siddipet Murder: బీమా డబ్బుల కోసం సొంత అత్తకే స్పాట్..
- హత్యను హిట్ అండ్ రన్గా చిత్రీకరించే ప్రయత్నం
- సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు
- అందులో కనిపించిన మహేంద్ర థార్ వాహనం
- TS 18 G 2277 కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు
- వాహనం కరుణాకర్ రెంట్కు తీసుకున్నట్టు గుర్తింపు
- ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలని ప్లాన్
- రామమ్మ పేరుపై 60 లక్షల వరకు SBI లైఫ్ ఇన్సూరెన్స్
- పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టిన వెంకటేష్
- రైతు బీమా రూ. 5 లక్షలు వస్తాయని స్కెచ్
- తన భూమిని కూడా రామమ్మ పేరుపై రిజిస్ట్రేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బు కోసం మనిషి ఏదైనా చేస్తాడు అని చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. తనకి వ్యాపారంలో నష్టం వచ్చిందని ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు అత్తని హత్య చేయాలని ప్లాన్ చేశాడో కసాయి అల్లుడు. ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించి, ఉన్న భూమి అత్త పేరుపై రాసి కొడుకు లెవెల్లో బిల్డప్ ఇచ్చి చివరికి కాల యముడిలా మారాడు. సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. బీమా డబ్బుల కోసం సొంత అత్తకే స్పాట్ పెట్టాడు. పైగా ఆమె హత్యను హిట్ అండ్ రన్గా చిత్రీకరించేందుకు ట్రై చేశాడు. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ముందు వెంకటేష్ వేసిన స్కెచ్ వెలవెలబోయింది. దీంతో పోలీసులకు పట్టుబడ్డాడు..
READ MORE: Pawan Kalyan: తీసుకునే లోకంలో ఇవ్వాలనుకున్న విహాన్ గొప్పవాడు
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
ఈనెల 7న సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్ద మాసాన్ పల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని రామమ్మ అనే మహిళ మృతి చెందింది. రామమ్మ అల్లుడు తాళ్ల వెంకటేష్ 100కి డయల్ చేసి విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు సాధారణ రోడ్డు ప్రమాదమని అనుకున్నారు. అయితే గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో మహేంద్ర థార్ వాహనం కనిపించింది. అయితే ఆ వాహనమే మహిళని ఢీకొట్టి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. TS 18 G 2277 నెంబర్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు తొగుట పోలీసులు. ఆ వాహనాన్ని సిద్దిపేటలో వెంకటేష్కి సోదరుడి వరుస అయిన కరుణాకర్ తీసుకున్నట్టు తేలింది. దీంతో పోలీసులకు రామమ్మ అల్లుడుపై అనుమానం కలిగింది. వెంకటేష్ని పోలీస్ స్టేషన్ కి పిలిపించారు తొగుట పోలీసులు..
READ MORE: JioPC: ఇది కదా కావాల్సింది.. జియోపీసీని ప్రారంభించిన జియో.. ఇకపై టీవీనే కంప్యూటర్గా..
వెంకటేష్ని తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. అత్త రామమ్మని తానే హత్య చేయించినట్టు ఒప్పుకున్నాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఇదంతా చేశానని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది మార్చిలో వెంకటేష్ పౌల్ట్రీ ఫారం బిజినెస్, వ్యవసాయం చేసి 22 లక్షల రూపాయల వరకు నష్టపోయాడు. అలాగే సోదరుడు కరుణాకర్కి అప్పుగా లక్షా 30 వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు.. వ్యాపారంలో వచ్చిన నష్టం నుంచి బయట పడాలనుకున్నాడు వెంకటేష్. వికలాంగురాలైన తన అత్తని హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలని ప్లాన్ వేశాడు. అత్త రామమ్మ పేరుపై 60 లక్షల వరకు SBI లైఫ్ ఇన్సూరెన్స్, పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టాడు. అలాగే ఆమె చనిపోతే మరో 5 లక్షల రూపాయలు రైతు బీమా వస్తాయని తన పేరుపై ఉన్న భూమిని కూడా అత్త పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు అల్లుడు వెంకటేష్. ఓ రోజు తన సోదరుడు కరుణాకర్ని పిలిచి తనకి ఇవ్వాల్సిన అప్పు ఇవ్వాలని అడగ్గా… కొద్దిగా సమయం కావాలని కోరాడు కరుణాకర్. వెంకటేష్.. కరుణాకర్కి ఓ ఆఫర్ ఇచ్చాడు అత్తని హత్య చేస్తే తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని.. అలాగే అత్త ఇన్సూరెన్స్ డబ్బులలో ఇద్దరం చేరి సగం పంచుకుందామని చెప్పడంతో కరుణాకర్ ఒకే చెప్పాడు. వెంటనే హత్యకు ప్లాన్ చేశారు…
READ MORE: Radhika Yadav: రాధిక యాదవ్ హత్య కేసు.. నిందితుడి గురించి సంచలన విషయాలు..
ఈ నెల 7న అల్లుడు వెంకటేష్.. విద్యుత్ అధికారులు బావి వద్దకు వస్తున్నారని చెప్పి.. అత్త రామమ్మను వెంటపెట్టుకుని పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆమెను మాసాన్పల్లి వద్ద రోడ్డుపైనే నిలబెట్టాడు. ఇంతలో కరుణాకర్ థార్ కారులో వచ్చి వేగంగా రామమ్మను ఢీకొట్టి వెళ్లిపోయాడు. కాసేపటి ఏమీ తెలియనట్లు వచ్చిన వెంకటేష్.. 100కి కాల్ చేసి హిట్ అండ్ రన్ అని చెప్పాడు. కానీ చివరికి పోలీసుల విచారణలో అల్లుడి బాగోతం బయటపడింది. దృశ్యం -2 సినిమా చూసి వెంకటేష్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.. అల్లుడి తెలివి చూసి పోలీసులే షాక్ అయ్యారు. కానీ అత్తని హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేద్దామన్న అల్లుడి ప్లాన్ బెడిసికొట్టింది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..