Ayush Mhatre-CSK: అందరి అంచనాలకు భిన్నంగా.. చెన్నై జట్టులోకి 17 ఏళ్ల కుర్రాడు!
- ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న రుతురాజ్ గైక్వాడ్
- యువ బ్యాటింగ్ సంచలనం ఆయుష్ మాత్రేకి అవకాశం
- 9 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు, 7 లిస్ట్ A మ్యాచ్లు ఆడిన మాత్రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. రుతురాజ్ స్థానంలో సీఎస్కే ఓ సీనియర్ బ్యాటర్ని తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా.. 17 ఏళ్ల కుర్రాడికి అవకాశం ఇచ్చింది. అతడే ముంబైకి చెందిన యువ బ్యాటింగ్ సంచలనం ఆయుష్ మాత్రే. ఈ విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అధికారికంగా ప్రకటించింది.
Also Read: LSG vs CSK: మెరిసిన ధోనీ, దూబే.. 5 ఓటముల తర్వాత చెన్నై విజయం
Also Read
- NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
విజయ్ హజారే ట్రోఫీ 2024లో ముంబై తరఫున ఆయుష్ మాత్రే అరంగేట్రం చేశాడు. కర్ణాటకపై తొలి మ్యాచ్లోనే 78 రన్స్ బాదాడు. నాగాలాండ్పై 181 పరుగులు, సౌరాష్ట్రపై 148 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ఇక 2025 జనవరిలో అయూష్ రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మేఘాలయపై తొలి మ్యాచ్ ఆడాడు. మాత్రే 9 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు, 7 లిస్ట్ A మ్యాచ్లలో 962 పరుగులు చేశాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. రుతురాజ్ గైక్వాడ్కు గాయం కావడంతో చెన్నై యాజమాన్యం రూ.30 లక్షల కనీస ధరకు అతడిని జట్టులోకి తీసుకుంది.
🚨LION ALERT ‼️
Mumbai youngster Ayush Mhatre drafted as a replacement for Ruturaj Gaikwad who had suffered an elbow fracture earlier. #WhistlePodu 🦁💛 pic.twitter.com/PGMDH12J9q
— Chennai Super Kings (@ChennaiIPL) April 14, 2025
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!