Ayodhya Ram Mandir : అయోధ్య రాముడికి విరాళమిచ్చిన సినీ ప్రముఖులు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒక్కటే మాట వినిపిస్తుంది.. అయోధ్య రాముడిని ప్రాణ ప్రతిష్ఠ.. మరో రెండు రోజుల్లో అయోధ్య రాముడు అందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు…ఈ మహా క్రతువు కోసం దేశ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఊరు వాడా రామ నామం తో మారుమోగుతుంది.. అయితే ఈ రామ మందిర నిర్మాణానికి పలువురు సినీ ప్రముఖులు విరాళాన్ని ఇచ్చారు.. ఎవరు ఎంత ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రణీతా సుభాస్, బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి, అక్షయ్ కుమార్, , అనుపమ్ ఖేర్, హేమ మాలిని, మనోజ్ జోషి, గుర్మీత్ చౌదరి, ముఖేష్ ఖన్నా, మనీష్ ముంద్రా తదితర ప్రముఖులు రామ మందిర నిర్మాణంలో భాగం పంచుకున్నారు. మరి ఈ చారిత్రాత్మక నిర్మాణం కోసం ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో ఒక్కసారి చూద్దాం..
Also Read
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
పవన్ కళ్యాణ్..
తెలుగు స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్నారు . ఈయన రామ మందిర నిర్మాణానికి భారీ విరాళాన్ని ఇచ్చారు.. ఈయన రూ.. 30 లక్షలకు పైగా విరాళం ఇచ్చారు పవర్ స్టార్. అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభం కాగానే అంటే 2021లోనే ఈ ఈ విరాళమందజేశారు పవన్ కల్యాణ్.. అంతేకాదు కొంతమంది నిర్మాతల చేత కూడా విరాళాన్ని అందించినట్లు తెలుస్తుంది.. మొత్తంగా పవన్ తరపున 80 లక్షల వరకు వెళ్ళాయని తెలుస్తుంది..
ప్రణీతా సుభాష్..
టాలివుడ్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ కూడా రామ మందిర నిర్మాణంలో భాగం అయ్యారు.. దేశవ్యాప్త ప్రచారానికి రూ.1 లక్ష విరాళంగా ఇచ్చారామె. ‘అయోధ్య రామమందిర నిధి సమర్పణ అభియాన్ కోసం నేను రూ. 1 లక్ష ఇచ్చాను. మీరందరూ చేతులు కలపాలి’ అని కోరింది…
అక్షయ్ కుమార్..
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రామమందిర నిర్మాణం కోసం విరాళం ప్రకటించారు. అయితే ఎంతిచ్చారో స్పష్టంగా చెప్పలేదు. ‘ అయోధ్యలో రాముని మందిరం మళ్లీ ప్రారంభం కావడం చాలా సంతోషం. ఇందుకు మనందరం చేతులు కలపాలి’ అని అందరికీ పిలుపునిచ్చారు..
బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి..
తెలుగు బిగ్ బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్ ఆది రెడ్డి రాముడిపై తనకున్న భక్తిని చాటుకున్నారు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్కు తన వంతుగా ఒక లక్ష రూపాయలు విరాళం అందించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు..
అలాగే ఇంకా..
ముఖేష్ ఖన్నా- 1.11 లక్షల రూపాయలు
మనీష్ ముంద్రా- కోటి రూపాయలు
హేమ మాలిని
గుర్మీత్ చౌదరి
గౌతమ్ గంభీర్- కోటి రూపాయలు
అనుపమ్ ఖేర్- (అయోధ్య రామమందిరానికి ఇటుకల విరాళం)
తెలిసిన సినీ ప్రముఖులు వీళ్లే, తెలియని వాళ్లు చాలా మందే ఉన్నారు..
తాజావార్తలు
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!