Uttarpradesh : కలల్లోకి వచ్చి నన్ను భయపెడుతుంది.. ప్రియురాలిని చంపి కాల్చేసిన ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో సంచలన హత్య కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. యువతి ఆగస్టు 24 నుంచి ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. అయితే ఆమె అదృశ్యంపై పోలీసులకు సమాచారం అందలేదు. గురువారం గోసాయిగంజ్ రైల్వే స్టేషన్ ఆవరణలోని పాత శిథిలమైన పోస్ట్ బంగ్లాలో కుళ్లిపోయిన యువతి మృతదేహం లభ్యమైంది. యువతి వయస్సు 21 సంవత్సరాలు, అంబేద్కర్ నగర్ నివాసి అని చెప్పారు.
Read Also:Gold Rate Today: మగువలకు శుభవార్త.. ఈరోజు గోల్డ్ రేట్ ఎంతుందంటే?
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
మృతురాలి తల్లి మృతదేహాన్ని గుర్తించారు. ఆగస్ట్ 24 నుంచి కనిపించకుండా పోయిందని ఎంత వెతికినా కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ఇద్దరు అబ్బాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారంలో యువతి హత్యకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడే ఈ విషయాన్ని అంగీకరించాడు. మృతురాలి తల్లి పోలీసులకు సమాచారం అందించారు.. రైల్వే స్టేషన్కు సమీపంలో తన కుమార్తె మృతదేహం పడి ఉందని ఓ యువకుడు తనకు ఫోన్ చేసి చెప్పాడని ఆమె తెలిపారు. తన కూతురు ఆ యువకుడి కలలోకి వచ్చి భయపెడుతోందని నిందితుడు చెప్పాడని తల్లి పేర్కొంది. అందుకే ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు. ఈ కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు యువతి ప్రియుడు. పోలీసుల విచారణలో హత్య చేసినట్లు అంగీకరించడంతో పాటు కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటపెట్టాడు.
Read Also:Success Story: రూ. 3వేలతో వ్యాపారం.. ప్రస్తుతం నెలకు రూ.70 లక్షల సంపాదన!
నిందితుడు విచారణలో తాను, తన ప్రియురాలు కలిసి ముంబై వెళ్లినట్లు తెలిపాడు. తర్వాత నిందితుడికి నచ్చని మరో అబ్బాయితో ఆ యువతి మాట్లాడడం మొదలు పెట్టింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తన ప్రియురాలిని హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. హత్య చేసేందుకు ముందు రాయితో తలను చితకబాది, మృతదేహం త్వరగా కుళ్లిపోయేలా, హత్యకు సంబంధించిన ఆధారాలు చెరిగిపోయేలా రసాయనాలు వేసి కాల్చేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!