Uttarpradesh : కలల్లోకి వచ్చి నన్ను భయపెడుతుంది.. ప్రియురాలిని చంపి కాల్చేసిన ప్రియుడు
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో సంచలన హత్య కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. యువతి ఆగస్టు 24 నుంచి ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. అయితే ఆమె అదృశ్యంపై పోలీసులకు సమాచారం అందలేదు. గురువారం గోసాయిగంజ్ రైల్వే స్టేషన్ ఆవరణలోని పాత శిథిలమైన పోస్ట్ బంగ్లాలో కుళ్లిపోయిన యువతి మృతదేహం లభ్యమైంది. యువతి వయస్సు 21 సంవత్సరాలు, అంబేద్కర్ నగర్ నివాసి అని చెప్పారు.
Read Also:Gold Rate Today: మగువలకు శుభవార్త.. ఈరోజు గోల్డ్ రేట్ ఎంతుందంటే?
Also Read
- Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
- SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
మృతురాలి తల్లి మృతదేహాన్ని గుర్తించారు. ఆగస్ట్ 24 నుంచి కనిపించకుండా పోయిందని ఎంత వెతికినా కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ఇద్దరు అబ్బాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారంలో యువతి హత్యకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడే ఈ విషయాన్ని అంగీకరించాడు. మృతురాలి తల్లి పోలీసులకు సమాచారం అందించారు.. రైల్వే స్టేషన్కు సమీపంలో తన కుమార్తె మృతదేహం పడి ఉందని ఓ యువకుడు తనకు ఫోన్ చేసి చెప్పాడని ఆమె తెలిపారు. తన కూతురు ఆ యువకుడి కలలోకి వచ్చి భయపెడుతోందని నిందితుడు చెప్పాడని తల్లి పేర్కొంది. అందుకే ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు. ఈ కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు యువతి ప్రియుడు. పోలీసుల విచారణలో హత్య చేసినట్లు అంగీకరించడంతో పాటు కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటపెట్టాడు.
Read Also:Success Story: రూ. 3వేలతో వ్యాపారం.. ప్రస్తుతం నెలకు రూ.70 లక్షల సంపాదన!
నిందితుడు విచారణలో తాను, తన ప్రియురాలు కలిసి ముంబై వెళ్లినట్లు తెలిపాడు. తర్వాత నిందితుడికి నచ్చని మరో అబ్బాయితో ఆ యువతి మాట్లాడడం మొదలు పెట్టింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తన ప్రియురాలిని హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. హత్య చేసేందుకు ముందు రాయితో తలను చితకబాది, మృతదేహం త్వరగా కుళ్లిపోయేలా, హత్యకు సంబంధించిన ఆధారాలు చెరిగిపోయేలా రసాయనాలు వేసి కాల్చేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
-
IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?
-
Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన ‘సూసైడ్ లేటర్’.. ప్రపంచ కుబేరులకు దడ!
-
TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!