Uttarpradesh : కలల్లోకి వచ్చి నన్ను భయపెడుతుంది.. ప్రియురాలిని చంపి కాల్చేసిన ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో సంచలన హత్య కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. యువతి ఆగస్టు 24 నుంచి ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. అయితే ఆమె అదృశ్యంపై పోలీసులకు సమాచారం అందలేదు. గురువారం గోసాయిగంజ్ రైల్వే స్టేషన్ ఆవరణలోని పాత శిథిలమైన పోస్ట్ బంగ్లాలో కుళ్లిపోయిన యువతి మృతదేహం లభ్యమైంది. యువతి వయస్సు 21 సంవత్సరాలు, అంబేద్కర్ నగర్ నివాసి అని చెప్పారు.
Read Also:Gold Rate Today: మగువలకు శుభవార్త.. ఈరోజు గోల్డ్ రేట్ ఎంతుందంటే?
Also Read
- Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
- Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే 'ఫ్లఫీ ఆమ్లెట్' చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
మృతురాలి తల్లి మృతదేహాన్ని గుర్తించారు. ఆగస్ట్ 24 నుంచి కనిపించకుండా పోయిందని ఎంత వెతికినా కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ఇద్దరు అబ్బాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారంలో యువతి హత్యకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడే ఈ విషయాన్ని అంగీకరించాడు. మృతురాలి తల్లి పోలీసులకు సమాచారం అందించారు.. రైల్వే స్టేషన్కు సమీపంలో తన కుమార్తె మృతదేహం పడి ఉందని ఓ యువకుడు తనకు ఫోన్ చేసి చెప్పాడని ఆమె తెలిపారు. తన కూతురు ఆ యువకుడి కలలోకి వచ్చి భయపెడుతోందని నిందితుడు చెప్పాడని తల్లి పేర్కొంది. అందుకే ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు. ఈ కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు యువతి ప్రియుడు. పోలీసుల విచారణలో హత్య చేసినట్లు అంగీకరించడంతో పాటు కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటపెట్టాడు.
Read Also:Success Story: రూ. 3వేలతో వ్యాపారం.. ప్రస్తుతం నెలకు రూ.70 లక్షల సంపాదన!
నిందితుడు విచారణలో తాను, తన ప్రియురాలు కలిసి ముంబై వెళ్లినట్లు తెలిపాడు. తర్వాత నిందితుడికి నచ్చని మరో అబ్బాయితో ఆ యువతి మాట్లాడడం మొదలు పెట్టింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తన ప్రియురాలిని హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. హత్య చేసేందుకు ముందు రాయితో తలను చితకబాది, మృతదేహం త్వరగా కుళ్లిపోయేలా, హత్యకు సంబంధించిన ఆధారాలు చెరిగిపోయేలా రసాయనాలు వేసి కాల్చేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
-
Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
ట్రెండింగ్
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!