Avatar 2: విడుదలకు ముందే రికార్డుల మోత.. రూ.20 కోట్ల టికెట్లు ముందే బుకింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avatar 2: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న క్షణంరానే వచ్చింది. అవతార్ -2 మూవీ.. శుక్రవారం థియేటర్లలోకి రానుంది. జేమ్స్ కామోరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.. అడ్వాన్స్ బుకింగ్స్లోనూ ఈ మూవీ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఒక్క భారత్లోనే ఇప్పటికే సుమారు 5 లక్షల మంది అడ్వాన్స్గా టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ.. అవతార్-2 మూవీ రిలీజ్కి ఒక్కరోజు ముందే టెలిగ్రామ్లో ప్రత్యక్షమైంది. భారత్ లో అవతార్-2 (ద వే ఆఫ్ వాటర్) సినిమా శుక్రవారం విడుదల అవుతుండగా, బాక్సాఫీసు వద్ద భారీ సందడి నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్ లో రూ.20 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ తరహా రికార్డు ఈ ఏడాది కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర తదితర చిత్రాలకే సాధ్యమైంది.
Read Also: Mega Star Chiranjeevi : రచ్చలేపుతున్న ‘వాల్తేరు వీరయ్య’ న్యూ పోస్టర్
వాస్తవానికి ఓవర్సీస్లో ఇప్పటికే విడుదలైన అవతార్-2 మూవీ మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది. చాలా వెబ్సైట్లు ఇప్పటికే ఈ సినిమా రివ్యూ రాసి మూడు కంటే తక్కువ రేటింగ్ ఇచ్చాయి. 13 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్-1 కంటే ఈ మూవీ ఏమంత గొప్పగా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో తమ ఓపికకి డైరెక్టర్ పరీక్ష పెట్టాడని కొంత మంది నెటిజన్లు చెప్తుండగా.. ఓ కార్టూన్ సినిమా చూసినట్లు ఉందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. శుక్రవారం తొలి రోజు దేశవ్యాప్తంగా అవతార్-2 సినిమా రూ. 40-50 కోట్లను వసూలు చేయచ్చని అంచనా. మరే హాలీవుడ్ సినిమాకు భారత్ లో ఈ ఘనత సాధ్యపడలేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సానుకూల అభిప్రాయాలు, రివ్యూలు వస్తుండడంతో, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా పైరసీ కాపీ లీక్ అయినట్టు సమాచారం వ్యాప్తి చెందుతోంది. అయితే గ్రాఫిక్స్ ఆధారిత చిత్రం కనుక థియేటర్లలో చూసిన అనుభవం ఫోన్లలో, కంప్యూటర్లలో చూసినప్పుడు ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
- West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
- Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
తాజావార్తలు
-
Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. ‘తల్లికి వందనం’కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
-
IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
-
West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
-
Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!