Automatic Payment Limit: వారికి శుభవార్త.. లిమిట్ పెంచిన ఆర్బీఐ..
Automatic Payment Limit: మీరు యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు చేస్తున్నారా? అయితే మీకు ఇది శుభవార్త. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని వర్గాల కోసం యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు పరిమితిని భారీగా పెంచింది.. ఇప్పటి వరకు రోజువారీగా యూపీఐ చెల్లింపులు గరిష్టంగా రూ.15 వేల వరకు మాత్రమే ఆర్బీఐ అనుమతించింది. కానీ, ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ పుంజుకోవడంతో రోజువారీ ఆటోమేటిక్ పేమెంట్స్ పరిమితిని రూ.లక్షకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. ఆటోమేటిక్ చెల్లింపుల పరిమితిని రూ. 15,000 నుండి రూ. 1 లక్ష వరకు పెంచింది ఆర్బీఐ.. ఎన్పీసీఐ చెల్లింపుల కోసం యూపీఐ ఆటోపే సౌకర్యాన్ని అందించింది. ఈ కొత్త ఫీచర్తో, కస్టమర్లు ఇప్పుడు మొబైల్ బిల్లులు, విద్యుత్ బిల్లులు, ఈఎంఐ చెల్లింపులు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, బీమా, మ్యూచువల్ ఫండ్లు ఇలా మొదలైన నెలవారి చెల్లింపుల కోసం ఏదైనా యూపీఐ అప్లికేషన్ని ఉపయోగించి చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు.
Read Also: Joe Biden: రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు జో బిడెన్ రాకపోవడానికి కారణం అదేనా?
Also Read
- Tamil Nadu Elections 2026: ఓటు హక్కు వినియోగించుకున్న సూర్య-జ్యోతిక జంట!
- West Bengal Elections: రణరంగంగా బెంగాల్.. తొలి దశలోనే రక్తపాతం.. బాంబు దాడులు, దహనకాండ!
- Hyderabad: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్.. రూ. 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
- PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యూపీఐ ద్వారా ఆటోమేటెడ్ చెల్లింపుల పరిమితిని కొన్ని వర్గాలకు ప్రతి లావాదేవీకి రూ. 15,000 నుండి రూ. 1 లక్ష వరకు పెంచింది. మ్యూచువల్ ఫండ్స్ కూడా దీని పరిధిలోకి వస్తాయి.. ప్రస్తుతానికి, రూ. 15,000 కంటే ఎక్కువ లావాదేవీల కోసం కార్డ్లు, ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)పై సూచనలను ప్రాసెస్ చేస్తున్నప్పుడు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్ఐ)లో సడలింపు అనుమతించబడుతుంది. మ్యూచువల్ ఫండ్ సబ్స్క్రిప్షన్, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల కోసం సింగిల్ ట్రాన్సాక్షన్ పరిమితిని రూ.15,000 నుంచి రూ.1,00,000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ రికరింగ్ లావాదేవీల కోసం ఈ-సూచనల అమలుపై జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొంది. . ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. గత వారం ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష సందర్భంగా యూపీఐ ద్వారా ఆటోమేటెడ్ లావాదేవీల పరిమితిని రూ.15,000 నుండి రూ.1 లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Tamil Nadu Elections 2026: ఓటు హక్కు వినియోగించుకున్న సూర్య-జ్యోతిక జంట!
-
West Bengal Elections: రణరంగంగా బెంగాల్.. తొలి దశలోనే రక్తపాతం.. బాంబు దాడులు, దహనకాండ!
-
Hyderabad: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్.. రూ. 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
-
PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
-
SRH Players Dance: గ్రౌండ్లో బ్యాట్తోనే కాదు.. ఫ్లోర్పై డాన్స్తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?