AUS vs IND: అతడు గంభీర్ మనిషి.. గొప్ప ప్రదర్శన చేయకున్నా జట్టులో ఉంటాడు!
- అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్
- సీనియర్ ప్లేయర్స్ రోహిత్, కోహ్లీలకు స్థానం
- ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా స్థానం
- హర్షిత్ గొప్ప ప్రదర్శన లేకున్నా జట్టులో ఉంటాడన్న శ్రీకాంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్ల కోసం భారత జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అక్టోబర్ 19న మొదలయ్యే వన్డే సిరీస్ జట్టులో సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు స్థానం దక్కింది. రోహిత్ స్థానంలో శుభ్మన్ గిల్ సారథిగా ఎంపికయ్యాడు. రెండు సిరీస్లలో చాలా తక్కువ మందికి చోటు దక్కగా.. అందులో ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా ఉన్నాడు. ఇటీవలి సిరీస్లలో జట్టులో ఉంటున్నా.. ఎక్కువగా అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాల్లో గొప్ప ప్రదర్శన అయితే చేయలేదు. అయినా కూడా హర్షిత్ జట్టులో కొనసాగుతున్నాడు. హర్షిత్ ఎంపికపై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్ అయ్యారు.
క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ… హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు హర్షిత్ రాణా ఇష్టమైన వ్యక్తి అని విమర్శించారు. ‘గంభీర్కు హర్షిత్ రాణా ఇష్టమైన ప్లేయర్. అందుకే అతడు భారత జట్టులో ఉంటున్నాడు. హర్షిత్కు గౌతీ చాలా ప్రాధాన్యం ఇస్తాడు. గంభీర్ ఇష్టమైన ప్లేయర్ జాబితాలో శుభ్మన్ గిల్ తర్వాత హర్షిత్ పేరే ఉంటుంది’ అని శ్రీకాంత్ చమత్కరించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లాండ్తో జరిగిన వన్డేలో అరంగేట్రం చేసిన రాణా.. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో జట్టులోనే ఉన్నాడు. ఆసియా కప్, వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్లు వరుసగా ఆడిన బుమ్రాకు ఆస్ట్రేలియా పర్యటనలోని వన్డేలకు బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చింది.
Also Read
- Kalma Homework: స్కూల్లో 'కల్మా' హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
Also Read: 314 Runs: మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్.. వన్డేల్లో 314 రన్స్ బాదిన భారత బ్యాటర్!
నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికై కూడా క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు. ‘ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకున్నారు. నితీశ్ మెరుగైన ప్రత్యామ్నాయం కాదని నా అభిప్రాయం. రవీంద్ర జడేజా మంచి ఎంపిక. అతడు బెస్ట్ ఆల్రౌండర్. నితీశ్ను బ్యాటర్గానే ఆడించాలి. అతడు బౌలింగ్ చాలా తక్కువగా వేస్తాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ నితీశ్ను తీసుకోలేదు. వన్డే ప్రపంచకప్ 2025 ప్లానింగ్లో అతడు ఉంటాడని నేను అనుకోవడం లేదు’ అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!