Ashok Gehlot: బీజేపీ హయాంలోనే.. రాజస్థాన్ బాలికల వేలంపై స్పందించిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Gehlot: రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో రుణాల చెల్లింపుల కోసం బాలికలను వేలం వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై విచారణ కోసం జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్ల్యూ) శుక్రవారం ఇద్దరు సభ్యులతో నిజ నిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. భిల్వారా జిల్లాకు దర్యాప్తు బృందాన్ని పంపినట్లు కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శనివారం స్పందించారు. ఈ వార్తలను ఆయన కొట్టిపారేశారు. గతంలో బీజేపీ హయాంలో ఈ తరహా ఘటనలు జరిగాయని ఆయన వెల్లడించారు. వాటి కాంగ్రెస్ ప్రభుత్వమే బయటపెట్టినట్లు చెప్పారు.
గతంలో 2005లో రాష్ట్రంలో బీజేపీ హయాంలో ఈ ఘటనలు జరిగాయని అశోక్ గహ్లోత్ తెలిపారు. 2019లో మేం అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చామన్నారు. మొత్తం 21 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. మరో ముగ్గురు మృతి చెందగా.. ఒకరు పరారీలో ఉన్నారన్నారు. ఇద్దరు బాధితులు మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పరిశీలకుడిగా ఆయన ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్నారు.
Also Read
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
- Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
- Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
South Korea: హాలోవీన్ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 150 మంది మృతి
ఇదిలా ఉండగా.. పలు వివాదాలను పరిష్కరించుకునే క్రమంలో స్టాంప్ పేపర్లు రాయించుకొని బాలికలను వేలం వేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ శుక్రవారం తెలిపారు. కొన్నేళ్లుగా ఈ తరహా ఘటనల గురించి వార్తలు వస్తున్నా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు భిల్వాఢా జిల్లాకు కమిషన్ బృందాన్ని పంపినట్లు వెల్లడించారు. రాష్ట్ర మహిళా కమిషన్ సైతం ఈ విషయంపై స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్ సంగీత బేణీవాల్.. శనివారం భిల్వాఢా జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు అయితే ఈ వార్తలను రాజస్థాన్ మంత్రి ప్రతాప్ ఖచారియావాస్ ఖండించారు. ‘ఇలాంటి ఘటనల్లో విచారణ పూర్తయ్యేవరకు వాస్తవాలు తెలుసుకోలేం. దీనిపై జాతీయ మహిళా కమిషన్ మొదట రాజస్థాన్ పోలీసులతో మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో బాలికల అమ్మకాలు జరగడం లేదు’ అని అన్నారు.
తాజావార్తలు
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
-
Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!