Ashok Gehlot: బీజేపీ హయాంలోనే.. రాజస్థాన్ బాలికల వేలంపై స్పందించిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Gehlot: రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో రుణాల చెల్లింపుల కోసం బాలికలను వేలం వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై విచారణ కోసం జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్ల్యూ) శుక్రవారం ఇద్దరు సభ్యులతో నిజ నిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. భిల్వారా జిల్లాకు దర్యాప్తు బృందాన్ని పంపినట్లు కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శనివారం స్పందించారు. ఈ వార్తలను ఆయన కొట్టిపారేశారు. గతంలో బీజేపీ హయాంలో ఈ తరహా ఘటనలు జరిగాయని ఆయన వెల్లడించారు. వాటి కాంగ్రెస్ ప్రభుత్వమే బయటపెట్టినట్లు చెప్పారు.
గతంలో 2005లో రాష్ట్రంలో బీజేపీ హయాంలో ఈ ఘటనలు జరిగాయని అశోక్ గహ్లోత్ తెలిపారు. 2019లో మేం అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చామన్నారు. మొత్తం 21 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. మరో ముగ్గురు మృతి చెందగా.. ఒకరు పరారీలో ఉన్నారన్నారు. ఇద్దరు బాధితులు మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పరిశీలకుడిగా ఆయన ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్నారు.
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
South Korea: హాలోవీన్ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 150 మంది మృతి
ఇదిలా ఉండగా.. పలు వివాదాలను పరిష్కరించుకునే క్రమంలో స్టాంప్ పేపర్లు రాయించుకొని బాలికలను వేలం వేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ శుక్రవారం తెలిపారు. కొన్నేళ్లుగా ఈ తరహా ఘటనల గురించి వార్తలు వస్తున్నా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు భిల్వాఢా జిల్లాకు కమిషన్ బృందాన్ని పంపినట్లు వెల్లడించారు. రాష్ట్ర మహిళా కమిషన్ సైతం ఈ విషయంపై స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్ సంగీత బేణీవాల్.. శనివారం భిల్వాఢా జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు అయితే ఈ వార్తలను రాజస్థాన్ మంత్రి ప్రతాప్ ఖచారియావాస్ ఖండించారు. ‘ఇలాంటి ఘటనల్లో విచారణ పూర్తయ్యేవరకు వాస్తవాలు తెలుసుకోలేం. దీనిపై జాతీయ మహిళా కమిషన్ మొదట రాజస్థాన్ పోలీసులతో మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో బాలికల అమ్మకాలు జరగడం లేదు’ అని అన్నారు.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!