ATM Withdraw: ఏటీఎం వాడేవారికి షాక్.. క్యాష్ విత్డ్రాయల్ ఛార్జీలు మరింత పెంపు!
- క్యాష్ విత్డ్రాయల్ ఛార్జీలు పెంపు.
- కొత్త చార్జీలు మే 1 నుంచి అమల్లోకి
- క్యాష్ విత్డ్రాయల్ ఫీజును రూ.17 నుంచి రూ. 19 లకు
- బ్యాలెన్స్ ఎంక్వైరీ ఫీజును ప్రతి లావాదేవీకి రూ.6 నుంచి రూ.7గా పెంపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ATM Withdraw: ఏటీఎం (ATM) అనేది బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసే ఓ యంత్రం. ఇది డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి నగదు విత్డ్రా చేయడానికి, బ్యాలెన్స్ చెక్ చేయడానికి, మినీ స్టేట్మెంట్ పొందడానికి, ఇతర బ్యాంకింగ్ సేవలు ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. కొన్ని ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ ఎంతగా పెరిగినా ఇప్పటికీ చాలా మంది ఏటీఎంల ద్వారా నగదు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. నగదు లావాదేవీలు పెరుగుతుండటంతో ఏటీఎంల వినియోగంపై కొత్త ఛార్జీలను అమలు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సిద్ధమైంది. ఇందులో భాగంగా, మే 1 నుండి ఏటీఎంల నుంచి నగదు డ్రా చేయడానికైనా, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికైనా అదనపు ఛార్జీలు వినియోగదారులకు పడనున్నాయి.
Read Also: Adah Sharma : బాక్సాఫీస్ కలెక్షన్ల గోల అవసరమా.. ఆదాశర్మ షాకింగ్ కామెంట్స్
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు పెంచాలని కోరారు. ఈ ప్రతిపాదనను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆమోదించగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కూడా ఆమోదం తెలిపింది. దీంతో కొత్త చార్జీలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఏటీఎం కొత్త చార్జీల విషయానికి వస్తే.. ప్రతి లావాదేవీకి క్యాష్ విత్డ్రాయల్ ఫీజును రూ.17 నుంచి రూ. 19 లకు పెంచారు. అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ ఫీజును ప్రతి లావాదేవీకి రూ.6 నుంచి రూ.7 చేసారు. ఇక ఏ బ్యాంకు ఖాతాదారులు అయినా సరే మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలు, నాన్-మెట్రో ప్రాంతాల్లో నెలకు 3 ఉచిత లావాదేవీలు చేయొచ్చు. ఈ పరిమితిని మించితే కొత్తగా నిర్ణయించిన ఛార్జీలు వర్తిస్తాయి. మీరు మీ బ్యాంకుకు చెందిన కార్డ్తో ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగిస్తే వాటిపై కూడా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
Read Also: Shalini Pandey : స్టైలిష్ డ్రెస్ లో షాలినీ పాండే.. ఆ ఫోజులు చూశారా..
వీటి ప్రభావం చిన్న బ్యాంకులపై పడనుంది. ఆ బ్యాంకులకు తక్కువ ఏటీఎంలు ఉండటంతో, వాటి ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో వారు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అలాగే తరచుగా ఏటీఎం వినియోగించే వారు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇలా నగదు లావాదేవీలకు చెల్లించే ఛార్జీలు పెరగడంతో ప్రజలు డిజిటల్ లావాదేవీల వైపు మరింతగా మొగ్గు చూపే అవకాశముంది.
తాజావార్తలు
-
Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
-
IPL 2026 Final: రూ.68.75 కోట్ల పేస్ వార్.. ఆర్సీబీ-జీటీ ఫైనల్ ఫలితాన్ని నిర్ణయించేది బౌలర్లేనా?
-
Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..