Kishan Reddy: దేశంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేలా బీజేపీ పాలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atal Bihari Vajpayee: భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు, భారతరత్న, మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయి జన్మదిన ఉత్సవాలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వెల్లడించారు. వాజ్ పేయి జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవం కింద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. స్వచ్ఛ భారత్ తో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఆయన జీవిత విశేషాలపై సభలు, సమావేశాల ద్వారా నేటి తరానికి తెలియజేస్తున్నామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. వాజ్ పేయి నైతిక విలువలతో కూడిన రాజకీయాలతో పరిపాలన చేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడారు.. నాడు పార్లమెంటులో ఒక్క ఓటు తక్కువ ఉన్నందుకు నైతిక బాధ్యత వహిస్తూ.. విలువలకు కట్టుబడి ప్రభుత్వాన్ని త్యాగం చేశారు అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Covid variant JN.1: దేశంలో 63 కొత్త వేరియంట్ కేసులు.. టాప్లో గోవా, తెలంగాణలో కూడా నమోదు..
Also Read
- GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
దేశంలో బడుగుబలహీన వర్గాలకు న్యాయం చేసేలా పాలన కొనసాగించారు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పధకంతో లక్షలాది గ్రామాలకు పక్కా రోడ్లు నిర్మించారు.. ప్రధాన మంత్రి స్వర్ణ చతుర్భుజి ద్వారా దేశం లో అనేక జాతీయ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన ద్వారా పేదలందరికి కోట్లాది గృహ నిర్మాణాలు చేపట్టారు అని ఆయన గుర్తు చేశారు. అమెరికా, యూకే లాంటి దేశాల బెదిరింపులను లెక్క చేయకుండా ప్రోక్రాన్ లో అణు పరీక్షలు నిర్వహించి.. భారతదేశాన్ని అణుశక్తి దేశంగా ప్రపంచ చిత్రపటంలో నిలిపిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్ పేయి అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు.
Read Also: JC Prabhakar Reddy: తాడిపత్రిలో రోడ్డుపై బైఠాయించిన జేసీ..
పాకిస్థాన్ తో స్నేహహస్తం అందించి ఢిల్లీ నుంచి పాకిస్థాన్ వరకు బస్సులో ప్రయాణం చేశారు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. అయితే భారత్ కు వెన్నుపోటు పొడిచి కార్గిల్ లో భారత భూభాగాన్ని ఆక్రమించిన పాకిస్థాన్ తో యుద్థం చేసి ఓడించిన నాయకత్వాన్ని అందించిన గొప్ప వ్యక్తి వాజ్ పేయి.. వాజ్ పేయి గారి ఉపన్యాసం కోసం వేలాది మంది సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయన్నారు. ఆయనో మంచి కవి.. అలాంటి మహానేత మనకు స్పూర్తిధాత.. ఆ మహనీయుడి స్ఫూర్తితో ఆయన అడుగు జాడల్లో ముందుకెళ్తూ నరేంద్ర మోడీ సుపరిపాలనను అందిస్తున్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి చూపిన బాట ఈ తరానికి, యువతరానికి, భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!