Asia Cup 2025: నేడు భారత జట్టు ఎంపిక.. గిల్, శ్రేయస్, సిరాజ్ డౌటే? అవకాశం ఎవరికో!
- సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025
- సెప్టెంబర్ 10న యూఏఈతో భారత్ మొదటి మ్యాచ్
- ఆసియా కప్నకు నేడే భారత జట్టు ఎంపిక
- ఎవరికి ఛాన్స్ వస్తుందా అని సర్వత్రా ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Predicted India Squad for Asia Cup 2025: ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఈసారి ఆసియా కప్ను టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. టోర్నీ మొదటి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ మధ్య జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నేడు 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే భారత్ బరిలో దిగడం దాదాపుగా ఖాయమైంది. ఆసియా కప్నకు భారత జట్టు ఎంపిక నేడే కాబట్టి ఎవరికి ఛాన్స్ వస్తుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
టీ20ల్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్లుగా స్థిరపడ్డారు. దాంతో శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్లలో ఒకరికే అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. మూడో ఓపెనర్గా జైస్వాల్ ఎంపికయ్యే అవకాశముంది. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఆడుతారు. రింకు సింగ్ జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2025లో పరుగుల వరద పారించిన శ్రేయస్ అయ్యర్ జట్టులో స్థానానికి పోటీ పడుతున్నాడు. కానీ శ్రేయస్ ఇంకొంతకాలం నిరీక్షించక తప్పదేమో. ఆల్రౌండర్లుగా శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్లు ఎంపికవుతారు. రెండో కీపర్గా జితేశ్ శర్మ జట్టులోకి రావొచ్చు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
కృనాల్ పాండ్యా పేరును కూడా బీసీసీఐ సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం లాంఛనమే. ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్ జట్టుకు ఎంపిక కానున్నారు. తుది జట్టులో మాత్రం బుమ్రాతో పాటు ఒక్కరే ఆడనున్నారు. మూడో పేసర్గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అవసరం అయితే శివమ్ దూబె కూడా బౌలింగ్ చేస్తాడు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో అదరగొట్టిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్కు చోటు కష్టమే. వరుణ్ చక్రవర్తి స్పెసలిస్ట్ స్పిన్నర్గా ఉంటాడు. చక్రవర్తితో పాటు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్లు స్పిన్ భారాన్ని పంచుకోవచ్చు. ఈరోజు భారత జట్టుపై పూర్తి స్పష్టత రానుంది.
Also Read: Horoscope Today: మంగళవారం దినఫలాలు.. ఆ రాశి వారు నేడు జాగ్రత్త సుమీ!
భారత జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, యశస్వి జైస్వాల్.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!