Arvind Kejriwal: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు శుభవార్త.. ప్రభుత్వం కొత్త ప్రణాళిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం తన జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన(Jai Bhim Mukhyamantri Pratibha Vikas Yojana)ను పునఃప్రారంభించబోతోంది. దీని కింద మెడికల్, ఇంజినీరింగ్, సివిల్ సర్వీసులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ 2018లో మొదటిసారిగా ఈ పథకాన్ని ప్రారంభించారు. కానీ దానిని నిలిపివేయవలసి వచ్చింది. ప్రభుత్వం దీన్ని మళ్లీ ప్రారంభించబోతోందని, మరికొన్ని పోటీ పరీక్షలను కూడా ఇందులో చేర్చనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వ ఏసీ/ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ తెలిపారు. మార్పులతో ప్రణాళిక సిద్ధమైందని, ఆమోదం కోసం క్యాబినెట్లో ఉంచుతామని మంత్రి పేర్కొన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం తొలిసారిగా 2018లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో SC, ST, OBC, EWS వర్గాల విద్యార్థులు మెడికల్, ఇంజనీరింగ్, సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధమవుతున్నారు.
Read Also:Telangana Elections 2023: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది: హరీశ్ రావు
Also Read
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ఉచితంగా కోచింగ్ ఇవ్వడమే కాకుండా ఇందులో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి నెల రూ.2500 ఆర్థిక సాయం అందించింది. కోచింగ్ కోసం ప్రయాణాలు, పుస్తకాలు కొనుగోలు చేయడంలో వారికి సహాయపడటానికి ఇది ఇవ్వడం జరిగింది. ఒక బ్యాచ్లో సుమారు 5000 మంది విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకున్నారు. కానీ కరోనా మహమ్మారి రావడంతో దాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఈ పథకం నవంబర్ 2021లో మరోసారి ప్రారంభించబడింది. 13 వేల మంది విద్యార్థులు దీని ప్రయోజనాన్ని పొందారు. అయితే కొద్దిరోజుల తర్వాత మళ్లీ మూసివేయాల్సి వచ్చింది. కోచింగ్ సెంటర్లకు సకాలంలో డబ్బులు వచ్చేలా పథకంలో మరికొన్ని మార్పులు చేశామని మంత్రి తెలిపారు. విద్యార్థుల వెరిఫికేషన్ అనంతరం ప్రతి ఆరు నెలలకోసారి కోచింగ్ సెంటర్లకు చెల్లింపులు జరుగుతాయి. దీంతోపాటు విద్యార్థులకు ప్రతి మూడు నెలలకోసారి స్టైఫండ్ కూడా అందజేస్తామన్నారు. ఇందులో మరిన్ని పోటీ పరీక్షలను ప్రభుత్వం చేర్చబోతోందని తెలిపారు. కేబినెట్ ఆమోదం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్ల రిజిస్ట్రేషన్ పనులు ప్రారంభిస్తామని మంత్రి చెప్పినట్లు సమాచారం. లక్ష్యం నెరవేరాలంటే మంచి కోచింగ్ సెంటర్లను మాత్రమే ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Read Also:Raashi Khanna: చూపులు తో మదిని దోచుకుంటున్న రాశి ఖన్నా..
తాజావార్తలు
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..