Arvind Kejriwal: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు శుభవార్త.. ప్రభుత్వం కొత్త ప్రణాళిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం తన జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన(Jai Bhim Mukhyamantri Pratibha Vikas Yojana)ను పునఃప్రారంభించబోతోంది. దీని కింద మెడికల్, ఇంజినీరింగ్, సివిల్ సర్వీసులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ 2018లో మొదటిసారిగా ఈ పథకాన్ని ప్రారంభించారు. కానీ దానిని నిలిపివేయవలసి వచ్చింది. ప్రభుత్వం దీన్ని మళ్లీ ప్రారంభించబోతోందని, మరికొన్ని పోటీ పరీక్షలను కూడా ఇందులో చేర్చనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వ ఏసీ/ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ తెలిపారు. మార్పులతో ప్రణాళిక సిద్ధమైందని, ఆమోదం కోసం క్యాబినెట్లో ఉంచుతామని మంత్రి పేర్కొన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం తొలిసారిగా 2018లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో SC, ST, OBC, EWS వర్గాల విద్యార్థులు మెడికల్, ఇంజనీరింగ్, సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధమవుతున్నారు.
Read Also:Telangana Elections 2023: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది: హరీశ్ రావు
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఉచితంగా కోచింగ్ ఇవ్వడమే కాకుండా ఇందులో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి నెల రూ.2500 ఆర్థిక సాయం అందించింది. కోచింగ్ కోసం ప్రయాణాలు, పుస్తకాలు కొనుగోలు చేయడంలో వారికి సహాయపడటానికి ఇది ఇవ్వడం జరిగింది. ఒక బ్యాచ్లో సుమారు 5000 మంది విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకున్నారు. కానీ కరోనా మహమ్మారి రావడంతో దాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఈ పథకం నవంబర్ 2021లో మరోసారి ప్రారంభించబడింది. 13 వేల మంది విద్యార్థులు దీని ప్రయోజనాన్ని పొందారు. అయితే కొద్దిరోజుల తర్వాత మళ్లీ మూసివేయాల్సి వచ్చింది. కోచింగ్ సెంటర్లకు సకాలంలో డబ్బులు వచ్చేలా పథకంలో మరికొన్ని మార్పులు చేశామని మంత్రి తెలిపారు. విద్యార్థుల వెరిఫికేషన్ అనంతరం ప్రతి ఆరు నెలలకోసారి కోచింగ్ సెంటర్లకు చెల్లింపులు జరుగుతాయి. దీంతోపాటు విద్యార్థులకు ప్రతి మూడు నెలలకోసారి స్టైఫండ్ కూడా అందజేస్తామన్నారు. ఇందులో మరిన్ని పోటీ పరీక్షలను ప్రభుత్వం చేర్చబోతోందని తెలిపారు. కేబినెట్ ఆమోదం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్ల రిజిస్ట్రేషన్ పనులు ప్రారంభిస్తామని మంత్రి చెప్పినట్లు సమాచారం. లక్ష్యం నెరవేరాలంటే మంచి కోచింగ్ సెంటర్లను మాత్రమే ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Read Also:Raashi Khanna: చూపులు తో మదిని దోచుకుంటున్న రాశి ఖన్నా..
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!