Delhi : ‘నవంబర్లోనే ఢిల్లీ ఎన్నికలు నిర్వహించండి’.. ఈసీకి కేజ్రీవాల్ విజ్ఞప్తి
- 'రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేస్తా'
- మనీష్ సిసోడియా కూడా బాధ్యతలు చేపట్టరు
- నవంబర్లోనే ఢిల్లీ ఎన్నికలు నిర్వహించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేదికపై నుంచి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. తన స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఒకరు ముఖ్యమంత్రి అవుతారని కేజ్రీవాల్ అన్నారు. నవంబర్లో ఢిల్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆప్ కన్వీనర్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రతో సహా ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. తీహార్ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రజలు నిర్ణయించే వరకు తాను ముఖ్యమంత్రి పదవిపై కూర్చోబోనని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని, అయితే ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయనని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఈ సమయంలో.. మనీష్ సిసోడియా కూడా ఎటువంటి బాధ్యత తీసుకోరని కేజ్రీవాల్ అన్నారు. సిసోడియా ప్రజల మధ్యకు వెళ్తామని ప్రకటించారు.
READ MORE: SIIMA 2024 : నాని సినిమాలకు సలాం కొట్టిన ‘సైమా’.. మొత్తం ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే..?
Also Read
- CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
సిసోడియా కూడా ఏ పదవి తీసుకోరు: కేజ్రీవాల్
ప్రజా తీర్పు అనంతరం మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి పదవి చేపడతారని.. తానే స్వయంగా ఈ విషయం తనతో చెప్పినట్లు కేజ్రీవాల్ అన్నారు. సతేంద్ర జైన్, అమానతుల్లా ఖాన్ కూడా త్వరలో బయటకు వస్తారని సీఎం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు తమ కోసం ప్రార్థించారన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. తన చిన్న పార్టీ దేశ రాజకీయాలను మార్చేసిందన్నారు. జైలులో ఆలోచించడానికి సమయం దొరికిందని కేజ్రీవాల్ తెలిపారు. తాను జైలు నుంచి ఒకే ఒక్క లేఖ రాశానని.. ఎల్జీ సాహెబ్కి ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాసినట్లు గుర్తు చేశారు. జెండా ఎగురవేసేందుకు అతిషీ జీకి అనుమతి ఉందని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..