Delhi : ‘నవంబర్లోనే ఢిల్లీ ఎన్నికలు నిర్వహించండి’.. ఈసీకి కేజ్రీవాల్ విజ్ఞప్తి
- 'రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేస్తా'
- మనీష్ సిసోడియా కూడా బాధ్యతలు చేపట్టరు
- నవంబర్లోనే ఢిల్లీ ఎన్నికలు నిర్వహించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేదికపై నుంచి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. తన స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఒకరు ముఖ్యమంత్రి అవుతారని కేజ్రీవాల్ అన్నారు. నవంబర్లో ఢిల్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆప్ కన్వీనర్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రతో సహా ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. తీహార్ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రజలు నిర్ణయించే వరకు తాను ముఖ్యమంత్రి పదవిపై కూర్చోబోనని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని, అయితే ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయనని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఈ సమయంలో.. మనీష్ సిసోడియా కూడా ఎటువంటి బాధ్యత తీసుకోరని కేజ్రీవాల్ అన్నారు. సిసోడియా ప్రజల మధ్యకు వెళ్తామని ప్రకటించారు.
READ MORE: SIIMA 2024 : నాని సినిమాలకు సలాం కొట్టిన ‘సైమా’.. మొత్తం ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే..?
Also Read
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
సిసోడియా కూడా ఏ పదవి తీసుకోరు: కేజ్రీవాల్
ప్రజా తీర్పు అనంతరం మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి పదవి చేపడతారని.. తానే స్వయంగా ఈ విషయం తనతో చెప్పినట్లు కేజ్రీవాల్ అన్నారు. సతేంద్ర జైన్, అమానతుల్లా ఖాన్ కూడా త్వరలో బయటకు వస్తారని సీఎం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు తమ కోసం ప్రార్థించారన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. తన చిన్న పార్టీ దేశ రాజకీయాలను మార్చేసిందన్నారు. జైలులో ఆలోచించడానికి సమయం దొరికిందని కేజ్రీవాల్ తెలిపారు. తాను జైలు నుంచి ఒకే ఒక్క లేఖ రాశానని.. ఎల్జీ సాహెబ్కి ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాసినట్లు గుర్తు చేశారు. జెండా ఎగురవేసేందుకు అతిషీ జీకి అనుమతి ఉందని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..