Delhi : ‘నవంబర్లోనే ఢిల్లీ ఎన్నికలు నిర్వహించండి’.. ఈసీకి కేజ్రీవాల్ విజ్ఞప్తి
- 'రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేస్తా'
- మనీష్ సిసోడియా కూడా బాధ్యతలు చేపట్టరు
- నవంబర్లోనే ఢిల్లీ ఎన్నికలు నిర్వహించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేదికపై నుంచి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. తన స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఒకరు ముఖ్యమంత్రి అవుతారని కేజ్రీవాల్ అన్నారు. నవంబర్లో ఢిల్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆప్ కన్వీనర్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రతో సహా ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. తీహార్ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రజలు నిర్ణయించే వరకు తాను ముఖ్యమంత్రి పదవిపై కూర్చోబోనని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని, అయితే ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయనని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఈ సమయంలో.. మనీష్ సిసోడియా కూడా ఎటువంటి బాధ్యత తీసుకోరని కేజ్రీవాల్ అన్నారు. సిసోడియా ప్రజల మధ్యకు వెళ్తామని ప్రకటించారు.
READ MORE: SIIMA 2024 : నాని సినిమాలకు సలాం కొట్టిన ‘సైమా’.. మొత్తం ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే..?
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
సిసోడియా కూడా ఏ పదవి తీసుకోరు: కేజ్రీవాల్
ప్రజా తీర్పు అనంతరం మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి పదవి చేపడతారని.. తానే స్వయంగా ఈ విషయం తనతో చెప్పినట్లు కేజ్రీవాల్ అన్నారు. సతేంద్ర జైన్, అమానతుల్లా ఖాన్ కూడా త్వరలో బయటకు వస్తారని సీఎం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు తమ కోసం ప్రార్థించారన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. తన చిన్న పార్టీ దేశ రాజకీయాలను మార్చేసిందన్నారు. జైలులో ఆలోచించడానికి సమయం దొరికిందని కేజ్రీవాల్ తెలిపారు. తాను జైలు నుంచి ఒకే ఒక్క లేఖ రాశానని.. ఎల్జీ సాహెబ్కి ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాసినట్లు గుర్తు చేశారు. జెండా ఎగురవేసేందుకు అతిషీ జీకి అనుమతి ఉందని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!