Ramayana : రణబీర్లో రాముడినే చూస్తారు – అరుణ్ గోవిల్ సెన్సేషనల్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినీ చరిత్రలో ‘రామాయణం’ వెండితెరపై ఆవిష్కృతమవుతుందంటే ప్రేక్షకుల్లో ఉండే ఉత్కంఠే వేరు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, మన సౌత్ బ్యూటీ సాయి పల్లవి సీతమ్మగా నటిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా సీనియర్ నటుడు అరుణ్ గోవిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గతంలో బుల్లితెర రామాయణంలో రాముడిగా నటించి ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోయిన అరుణ్ గోవిల్, రణబీర్ లుక్స్.. పర్ఫార్మెన్స్పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
Also Read : Vishwambhara : విశ్వంభర టీజర్పై విమర్శలు.. యూవీ క్రియేషన్స్ షాకింగ్ డెసిషన్!
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అరుణ్ గోవిల్ మాట్లాడుతూ.. ‘దేవుడి పాత్రలను పోషించడం సామాన్యమైన విషయం కాదు. ప్రేక్షకులు ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు పాత పాత్రలతో పోల్చడం సహజం. మనం దేవుడి పాత్ర చేస్తున్నప్పుడు, చూడగానే ఆ దేవుడే దిగి వచ్చాడా అన్నట్టుగా ఉండాలి. అందుకే ఈ పాత్రలకు ‘లుక్స్’ అనేవి చాలా ముఖ్యం’ అని ఆయన వివరించారు. అలా రణబీర్ కపూర్ గురించి చెబుతూ.. ‘ఆడియన్స్ తెరపై మనల్ని (నటులను) చూడరు, ఆ పాత్రలో ఉన్న దేవుడిని చూస్తారు. బహుశా దేవుడు నిజంగా ఇలానే ఉంటాడేమో అన్నట్లుగా మనం ప్రేక్షకులను ప్రభావితం చేయాలి. రణబీర్ కపూర్ ఆ విషయంలో సక్సెస్ అవుతాడు, జనం ఆయనలో దేవుడిని చూస్తారని’ అరుణ్ గోవిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన రాముడి పాత్రల కంటే ఇది భిన్నంగా, ప్రభావవంతంగా ఉండబోతోందని ఆయన హింట్ ఇచ్చారు.
నితేష్ తివారీ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నా ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో యష్ (Yash) రావనుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా.. కైకేయి/మంధరిగా లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ కథను విజువల్ వండర్గా తీర్చిదిద్దేందుకు చిత్ర బృందం పగలు రాత్రి కష్టపడుతోంది. అరుణ్ గోవిల్ లాంటి లెజెండరీ నటుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రణబీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!