ఆన్లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడిన 60 మంది భారతీయులను శ్రీలంకలోక్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ (సీఐడీ) అరెస్టు చేసింది. కొలంబోలోని మడివెల, బత్తరముల్లా, పశ్చిమ తీర నగరమైన నెగోంబో నుంచి వారిని గురువారం అరెస్టు చేశారు. ఈ దాడిలో 135 మొబైల్స్, 57 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికార ప్రతినిధి ఎస్ఎస్పి నిహాల్ తల్దువా తెలిపారు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. అనుమానంతో నెగొంబోలోని ఓ ఇంటిపై సోదాలు నిర్వహించగా కీలక ఆధారాలు లభించాయి. మొదటగా13 మంది అనుమానితులను ప్రాథమికంగా అరెస్టు చేశారు. వారి నుంచి 57 ఫోన్లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి ఆపరేషన్ల ఫలితంగా మిగతా వారిని మందిని అరెస్ట్ చేశారు. వీరికి అక్కడే ఉంటున్న ఓ కుటుంబం సహాయం చేస్తున్నట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో నగదు ఇస్తామని చెప్పి బాధితురాలిని వాట్సాప్ గ్రూప్లోకి లాక్కెళ్లారు. ప్రాథమిక చెల్లింపు తర్వాత మిగిలిన డబ్బును డిపాజిట్ చేయాలని ఒత్తిడి చేసినట్లు విచారణలో వెల్లడైంది.
READ MORE: Darshan controversies: మర్డర్ కేసు మాత్రమే కాదు.. దర్శన్ వివాదాల లిస్టు చూశారా?
అంతర్జాతీయ సంబంధాలు బహిర్గతం..
ఈ వ్యక్తులకు దుబాయ్, ఆఫ్ఘనిస్తాన్ తో కూడా అంతర్జాతీయ సంబంధాలు ఉన్నట్లు బహిర్గతమయ్యాయి. బాధితుల్లో స్థానికులు, విదేశీయులు కూడా ఉన్నారని నివేదిక పేర్కొంది. వీరు ఆర్థిక మోసాలు, అక్రమ బెట్టింగ్లు, జూదం వంటి పలు కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు.