Arava Sridhar Case: గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారం సంబంధించి తాజాగా బాధితురాలు తన లాయర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో అరవ శ్రీధర్ సంబంధించిన అనేక విషయాలను బట్టబయలు చేసింది. మీడియా సమావేశంలో ముందుగా లాయర్ మాట్లాడుతూ.. తాము ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎన్ హెచ్ఆర్సి సహకారంతో ఎమ్మెల్యే పై కేసు నమోదు జరిగిందంటూ తెలియజేశారు. ఇంకా కేసుకు సంబంధించిన మరికొన్ని విషయాలను ఆయన మాట్లాడారు. అలాగే ఈ కేసు సంబంధించి హైకోర్టులో గురువారం నాడు విచారణ జరుగబోతున్నట్లు తెలియజేశారు. వాటికీ సంబంధించిన విషయాలను కూడా పూర్తిగా తెలుపుతానని ఆయన అన్నారు.
Gaddar Awards: ఉగాది పండుగ రోజు గద్దర్ అవార్డుల పంపిణీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఇక సమావేశంలో బాధితురాలు మాట్లాడుతూ.. తాను ఎక్కడ 25 కోట్లు డిమాండ్ చేయలేదని, బయట సర్కులేట్ అవుతున్న వీడియోలో వాయిస్ తనది కాదని తెలిపింది. అలాగే ఎమ్మెల్యే శ్రీధర్ ఓ డమ్మీ ఎమ్మెల్యే క్యాండెట్ అంటూ సంచలన కామెంట్స్ చేసింది. అలాగే ఎమ్మెల్యే శ్రీధర్ తనతో కాకుండా మరో ఆరు మంది మహిళలతో వివాహేతర సంబంధం కూడా కలిగి ఉన్నారని.. అందుకు సంబంధించిన వివరాలను తాను కనుగొన్నందుకే తనపై ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపింది.

High Court: సర్కార్కు హైకోర్టులో ఎదురు దెబ్బ.. నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం..
ఇంకా ఆమె మాట్లాడుతూ.. మా ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలకు సంబంధించి మరికొన్ని వీడియోలు అతి త్వరలో విడుదల చేస్తున్నట్లు బాధితురాలు చెప్పుకొచ్చింది. అయితే ఆమె 18 నెలల్లో అన్నిసార్లు అబార్షన్ చేయించిందన్న విషయంపై ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చింది. తనకి అబార్షన్ కాదని ‘అబార్ట్’ అయినట్టు మరో కొత్త విషయాన్ని తెరపైకి తీసుకువచ్చింది. చూడాలి మరి ముందు ముందు ఈ కేసులో ఎన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో..