Apple IPhone 15: ఐఫోన్ 15 లాంచ్ అయిన వెంటనే ఆపిల్కు రూ.4 లక్షల కోట్ల నష్టం.. ఎలాగో తెలుసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple IPhone 15: ఆపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్ 15 ను మంగళవారం విడుదల చేసింది. లాంచ్ తర్వాత ఆపిల్ షేర్లలో సుమారు రెండు శాతం క్షీణత కనిపించింది. దీని వల్ల కంపెనీ 47.76 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. ఇది భారతీయ రూపాయలలో రూ. 4 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. నిజానికి ఈ స్టాక్ పతనానికి అసలు కారణం చైనా కంపెనీ హువావే టెక్నాలజీస్. దీని ట్రాఫిక్ ను 20 శాతం పెంచాలని నిర్ణయించింది. ఇటీవ ఆపిల్ అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన చైనాలో ఆ ఫోన్ల వాడకంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే 5 రోజుల్లో కంపెనీ షేర్లు 6 శాతానికి పైగా క్షీణించాయి.
పడిపోయిన ఆపిల్ షేర్లు
మంగళవారం ఆపిల్ షేర్లు 1.76 శాతం క్షీణించి 176.30డాలర్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్లో కంపెనీ షేర్లు కూడా 174.82డాలర్లకి చేరాయి. కంపెనీ షేర్లు రూ.179.49 వద్ద ప్రారంభమయ్యాయి. గత 5 రోజుల్లో కంపెనీ షేర్లు 6 శాతానికి పైగా క్షీణించాయి. అయితే ఈ ఏడాది ఆపిల్ షేర్లు ఇన్వెస్టర్లకు భారీ రాబడిని ఇచ్చాయి. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, ఆపిల్ షేర్లు ఇప్పటివరకు 41 శాతం పెరిగాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆపిల్ స్టాక్ కొన్ని రోజులు ఒత్తిడిని ఎదుర్కోవచ్చు.
Also Read
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
- Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
Read Also:BJP Fast Initiation: బీజేపీ 24 గంటల ఉపవాస దీక్ష.. ధర్నాచౌక్, ఇందిరా పార్క్ వద్ద ఆందోళన
ఆపిల్ స్టాక్ ఎందుకు పడిపోయింది?
యాపిల్ స్టాక్ క్షీణించడానికి చైనాయే అసలు కారణమని భావిస్తున్నారు. చైనాకు చెందిన హువావే టెక్నాలజీస్ తన మేట్ 60 సిరీస్ స్మార్ట్ఫోన్ల కోసం ఈ సంవత్సరం ద్వితీయార్థంలో షిప్మెంట్ లక్ష్యాన్ని 20 శాతం పెంచిందని నివేదిక వెల్లడించిన తర్వాత ఆపిల్ షేర్ ధర పడిపోయింది. ఆపిల్ కొత్త ఐఫోన్ 15 సిరీస్, ఇతర ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసిన సమయంలో చైనా కంపెనీ నుంచి ఈ ప్రకటన వచ్చింది. కొన్ని రోజుల క్రితం చైనా ప్రభుత్వం ఐఫోన్, ఇతర విదేశీ పరికరాలను ఉపయోగించకూడదని తన ఉద్యోగులను ఆదేశించింది.
యాపిల్ రూ.4 లక్షల కోట్ల నష్టం
కంపెనీ షేర్ల పతనం కారణంగా కంపెనీ వాల్యుయేషన్లో భారీ క్షీణత నెలకొంది. ఈ క్షీణత 47.76 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారతీయ రూపాయలలో ఈ నష్టం దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, సోమవారం మార్కెట్ ముగిసినప్పుడు, కంపెనీ మార్కెట్ క్యాప్ 2.799 ట్రిలియన్ డాలర్లు, ఇది మంగళవారం మార్కెట్ ముగిసిన తర్వాత 2.752 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే కంపెనీ మార్కెట్ క్యాప్ 47 బిలియన్ డాలర్లకు పైగా క్షీణించింది.
Read Also:MSMP: అనుష్కతో మాట్లాడే లక్కీ ఛాన్స్… ఆ లక్కీ లేడీస్ కి మాత్రమే
తాజావార్తలు
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!