NTV Telugu Site icon

Vasireddy Padma: చంద్రబాబు వల్ల మహిళలకు ఏనాడూ మంచి జరగలేదు..

Vasireddy Padma

Vasireddy Padma

Vasireddy Padma on Chandrababu: టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శల దాడి చేశారు. చంద్రబాబు పురుషాధిక్య అభిప్రాయాలు కలిగిన వ్యక్తి అని.. ఆయన వల్ల మహిళలకు ఏనాడూ మంచి జరగలేదని అన్నారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకోవడమే గాని, మహిళా అభ్యున్నతికి పనులు చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదని మండిపడ్డారు.

Read Also: Rain Alert: ఏపీకి వర్షసూచన.. రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి కోసం సీఎం జగన్ ఆలోచన చేసినట్లు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచన చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళకు అన్ని రంగాల్లోనూ యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న ఘనత సీఎం జగన్‌దేనని ప్రశంసించారు. విజనరీ గురించి మాట్లాడుతోన్న మిగిలిన ముఖ్యమంత్రులు.. ఎందుకు మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడటం లేదని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.