STU: ఉపాధ్యాయులు బోధనేతర పనులకు దూరంగా ఉండండి.. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కీలక నిర్ణయం
- AP రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (STU) బోధనేతర పనులను బహిష్కరించాలని కీలక నిర్ణయం.
- హాజరు యాప్, మధ్యాహ్న భోజనం యాప్ తప్ప మిగిలిన అన్ని యాప్లను బహిష్కరించనున్నట్లు ప్రకటన
- ప్రభుత్వం ప్రవేశపెట్టిన “విద్యాశక్తి” కార్యక్రమాన్ని కూడా STU బహిష్కరించనున్నట్లు స్పష్టం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
STU: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (STU) అధ్యక్షుడు, FAPTO చైర్మన్ సాయి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయులు ఇకపై బోధనేతర (Non-Teaching) పనుల్లో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. హాజరు యాప్, మధ్యాహ్న భోజనం యాప్ మినహా మిగిలిన అన్ని యాప్లను బహిష్కరించాలని తీర్మానించినట్లు తెలిపారు. అదేవిధంగా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన “విద్యాశక్తి” కార్యక్రమాన్ని కూడా బహిష్కరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో అన్ని జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు, కలెక్టర్లు, రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు మెమొరాండం సమర్పించినట్లు సాయి శ్రీనివాస్ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం గమనించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ 2025 నియామకాల విషయంలో కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నియామకాలు వెబ్ ఆప్షన్ల ద్వారా కాకుండా మ్యానువల్ విధానంలో జరగాలని STU డిమాండ్ చేసింది. గతంలో ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలను చట్టబద్ధంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి జూన్ నెలలో పూర్తి చేసినప్పటికీ.. వేలాది మంది ఉపాధ్యాయులు ఇప్పటికీ రిలీవర్ లేక పాత పాఠశాలల్లోనే కొనసాగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
Rohith Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ కార్ల కలెక్షన్ లోకి కొత్త Tesla Model Y..
బదిలీ పొందిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయడానికి పాఠశాల విద్యాశాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. డీఎస్సీ నియామకాల సమయంలో రిలీవర్ లేని పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదని ఆయన గుర్తుచేశారు. ఖాళీలు భర్తీ కాకపోతే అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకం ద్వారా ఆ పోస్టులను భర్తీ చేసి, బదిలీ పొందిన ఉపాధ్యాయులను రిలీవ్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదని సాయి శ్రీనివాస్ పేర్కొన్నారు.
అదేవిధంగా, రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన 9620 మోడల్ ప్రైమరీ పాఠశాలలలో ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనే ప్రభుత్వ లక్ష్యం అమలు కావడంలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం చాలా మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో కేవలం ఇద్దరు లేదా ముగ్గురు ఉపాధ్యాయులే పని చేస్తున్నారని వివరించారు. అలాగే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో హైస్కూల్ ప్లస్ పాఠశాలలకు మంజూరు చేసిన 1752 పోస్టుల్లో దాదాపు 950 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వం ఆలోచించాలన్నారు.
Rohith Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ కార్ల కలెక్షన్ లోకి కొత్త Tesla Model Y..
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!