STU: ఉపాధ్యాయులు బోధనేతర పనులకు దూరంగా ఉండండి.. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కీలక నిర్ణయం
- AP రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (STU) బోధనేతర పనులను బహిష్కరించాలని కీలక నిర్ణయం.
- హాజరు యాప్, మధ్యాహ్న భోజనం యాప్ తప్ప మిగిలిన అన్ని యాప్లను బహిష్కరించనున్నట్లు ప్రకటన
- ప్రభుత్వం ప్రవేశపెట్టిన “విద్యాశక్తి” కార్యక్రమాన్ని కూడా STU బహిష్కరించనున్నట్లు స్పష్టం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
STU: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (STU) అధ్యక్షుడు, FAPTO చైర్మన్ సాయి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయులు ఇకపై బోధనేతర (Non-Teaching) పనుల్లో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. హాజరు యాప్, మధ్యాహ్న భోజనం యాప్ మినహా మిగిలిన అన్ని యాప్లను బహిష్కరించాలని తీర్మానించినట్లు తెలిపారు. అదేవిధంగా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన “విద్యాశక్తి” కార్యక్రమాన్ని కూడా బహిష్కరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో అన్ని జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు, కలెక్టర్లు, రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు మెమొరాండం సమర్పించినట్లు సాయి శ్రీనివాస్ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం గమనించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ 2025 నియామకాల విషయంలో కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నియామకాలు వెబ్ ఆప్షన్ల ద్వారా కాకుండా మ్యానువల్ విధానంలో జరగాలని STU డిమాండ్ చేసింది. గతంలో ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలను చట్టబద్ధంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి జూన్ నెలలో పూర్తి చేసినప్పటికీ.. వేలాది మంది ఉపాధ్యాయులు ఇప్పటికీ రిలీవర్ లేక పాత పాఠశాలల్లోనే కొనసాగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
Rohith Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ కార్ల కలెక్షన్ లోకి కొత్త Tesla Model Y..
బదిలీ పొందిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయడానికి పాఠశాల విద్యాశాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. డీఎస్సీ నియామకాల సమయంలో రిలీవర్ లేని పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదని ఆయన గుర్తుచేశారు. ఖాళీలు భర్తీ కాకపోతే అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకం ద్వారా ఆ పోస్టులను భర్తీ చేసి, బదిలీ పొందిన ఉపాధ్యాయులను రిలీవ్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదని సాయి శ్రీనివాస్ పేర్కొన్నారు.
అదేవిధంగా, రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన 9620 మోడల్ ప్రైమరీ పాఠశాలలలో ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనే ప్రభుత్వ లక్ష్యం అమలు కావడంలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం చాలా మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో కేవలం ఇద్దరు లేదా ముగ్గురు ఉపాధ్యాయులే పని చేస్తున్నారని వివరించారు. అలాగే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో హైస్కూల్ ప్లస్ పాఠశాలలకు మంజూరు చేసిన 1752 పోస్టుల్లో దాదాపు 950 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వం ఆలోచించాలన్నారు.
Rohith Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ కార్ల కలెక్షన్ లోకి కొత్త Tesla Model Y..
తాజావార్తలు
-
KS Bharat Retirement: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్..
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..