Mahanadu 2023: 160 స్థానాల్లో గెలవడం.. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahanadu 2023: వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలను టీడీపీ గెలుచుకోవడ.. అధికారంలోకి రావడం ఖాయం అన్నారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. రాజమండ్రిలో ప్రారంభమైన టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. టీడీపీది ప్రజాపక్షమే అన్నారు. 2019లో ఓ దొపిడీ దొంగకు ప్రజలు ఓట్లేసి తప్పు చేశారన్నారు. సంక్షేమాన్ని.. దాంతో సమానంగా అభివృద్ధి చేశాం. కానీ, మనం చేసిన పనులను చెప్పుకోలేకపోయాం. టీడీపీని ఎదుర్కొలేక కోడి కత్తి డ్రామా, సొంత బాబాయిని చంపి ప్రజల సింపతితో జగన్ సీఎం అయ్యారని విమర్శించారు.. సీఎం జగన్.. వేటాడి.. వెంటాడి తరిమి కొట్టే రోజులు వచ్చాయని హెచ్చరించారు.. 151 స్థానాలు రావడంతో జగన్కు కళ్లు నెత్తికెక్కాయి.. ఒళ్లు మదమెక్కింది. ఇంత అనుభవమున్న పార్టీ అయినా సరే గత నాలుగేళ్లల్లో ఎన్నో కష్టాలు పడ్డామన్నారు.
ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజలు సీఎం జగన్ని ఛీకొడుతున్నారని వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు.. సీఎం జగన్ నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. జగన్ పేదవాడంట.. చంద్రబాబు ధనవంతుడట. జగన్ అబద్దాల కోరు అంటూ మండిపడ్డారు.. 28 రాష్ట్రాల సీఎంలకు రూ. 508 కోట్లు ఉంటే.. జగన్ ఒక్కడికే అంత ఆస్తి ఉంటుందన్న ఆయన.. 30 కేజీలున్న జగన్కు ఏడు బంగళాలు కావాలంట.. బెంగళూరు, ఇడుపులపాయ, లోటస్ పాండ్, అమరావతిలో ప్యాలెస్ ఎవరిది..? అని నిలదీశారు. ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తానంటూ విశాఖలో రాజధాని పెట్టి అక్కడో ఇల్లు కడతాడంట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోనే కాదు.. పులివెందులలో కూడా కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు.
Also Read
చంద్రబాబు కట్టిన టిడ్కో ఇళ్లను పక్కన పెట్టేసి.. సెంటు పట్టా ఇచ్చారు. నాలాగా పొడవుగా ఉండే వాడికి సెంటు పట్టా సరిపోతుందా..? అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.. ప్రతి మహిళా ఓ ఆడియరుగా మారాలి. గతంలో ఇంటి ఖర్చు ఎంతైంది..? ఇప్పుడు ఎంతైందో ఆలోచించండి అని సూచించారు. ఇక, రూ. 2 వేల నోట్ల రద్దుతో తన దగ్గరున్న నోట్లను ఏం చేయాలో తెలియక జగన్ తల పట్టుకుంటున్నారన్న ఆయన.. లోకేష్ పాదయాత్ర అద్భుతంగా జరుగుతోంది. ఓ ఆశయం గురించి 48 డిగ్రీల ఎండలో లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. మహానాడుకు ప్రభుత్వం బస్సులు ఇవ్వకుండా.. రాకుండా చేశారని మండిపడ్డారు.. మహానాడు కోసం అలంకరణ చేస్తే.. జగన్ బ్లేడ్ బ్యాచ్.. ఫ్లెక్సీలను బ్లేడ్లతో కోసేశారని ఆరోపించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
తాజావార్తలు
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్పై మెగాస్టార్ రియాక్షన్ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!