AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్లో ఇవాళ టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల కానున్నాయి.. టెన్త్ ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు ఈ రోజు 11 గంటలకు అధికారికంగా అందుబాటులోకి రానున్నాయి.
ఇక, విద్యార్థులు తమ ఫలితాలను పలు మార్గాల్లో సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. SSC ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చు. అలాగే మన మిత్ర వాట్సాప్ సేవలో 9552300009 నంబర్కు “Hi” అని మెసేజ్ పంపడం ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. అదనంగా LEAP మొబైల్ యాప్ ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. డిజిలాకర్ యాప్ మరియు వెబ్సైట్లో కూడా మార్కుల మెమోలు అందుబాటులో ఉండనున్నాయి అని తన ట్వీట్లో పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్..
మరోవైపు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ తమ స్కూల్ లాగిన్ల ద్వారా ఫలితాలను విడుదలైన వెంటనే డౌన్లోడ్ చేసుకునే వీలుంటుంది అని తెలిపారు మంత్రి లోకేష్.. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సందేశం ఇచ్చారు… లక్ష్యాలను సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ.. ఆశించిన ఫలితాలు రాకపోయినా నిరుత్సాహపడవద్దని, ఇది జీవిత ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమేనని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నారా లోకేష్..
