AP Riots: ఏపీలో హింసాత్మక ఘటనలు.. పోలీసు రియాక్షన్ స్టార్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Riots: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత మొదలైన గొడవల టెన్షన్ కొనసాగుతూనే ఉంది. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండడంతో పోలీసులు అలర్ట్గా ఉన్నారు. ఇక నుంచి ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో పోలీస్ పికెట్ కొనసాగుతుండగా.. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్రెడ్డితో పాటు.. కూటమి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. భద్రత మరింత పెంచారు. దేవగుడిలో ఆదినారాయణ రెడ్డి సోదరులు ఇళ్ల వద్ద పోలీసుల మోహరించారు. కొంత వారిని అనుమతించడం లేదు. ఆక్టోపస్ ఎస్పీ ఆధ్వర్యంలో భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సుధీర్ రెడ్డిని మరో ప్రాంతానికి తరలించారు.
Read Also: CM Revanth Reddy: రాష్ట్ర ఆదాయం పెంపుపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు
Also Read
- US-Iran: తాజా దాడులతో శాంతి చర్చలపై నీలినీడలు.. రగిలిపోతున్న ఇరాన్
- IPL Cricket Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!
- Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
- US: అమెరికాలో ఘోరం.. స్టోర్లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జెడ్పీటీసీ భర్త భాను కుమార్రెడ్డి, సర్పంచ్ గణపతి రెడ్డిలతో పాటు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. అటు.. చంద్రగిరిలో ఉద్రిక్త పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. రెండు పార్టీల అభ్యర్థులను గృహ నిర్బంధంలోనే ఉంచారు పోలీసులు. మరో వైపు గన్మెన్ ధరణి ఫైరింగ్లో కాలికి బుల్లెట్ గాయమైన సుధాకర్రెడ్డిని చికిత్స కోసం చెన్నైకి తరలించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి హింసలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వైసీపీ, టీడీపీలకు చెందిన 91 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఉరవకొండ కోర్టులో హాజరు పర్చారు. వారిలో టీడీపీకి చెందిన వారు 54 మంది, వైసీపీకి చెందిన వారు 37 మంది ఉన్నారు. అటు.. కోనసీమ జిల్లాల్లో కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. వల్లూరు గ్రామ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యూదుతో కేసు నమోదు చేశారు అంగర పోలీసులు. జనసేన ఇంఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసును నమోదు చేశారు. తోట త్రిమూర్తులుతోపాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు. మొత్తానికి గురువారం చిన్న చిన్న ఘటనలు మినహా పరిస్థితి అంతా అదుపులో ఉందని తెలిపారు పోలీసులు. నిఘాను కట్టుదిట్టం చేశారు.
తాజావార్తలు
-
BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
-
US-Iran: తాజా దాడులతో శాంతి చర్చలపై నీలినీడలు.. రగిలిపోతున్న ఇరాన్
-
బండోడి ట్యూన్కి బక్కోడి పాట.. Itlu Arjuna First Single ప్రోమో అదిరింది!
-
IPL Cricket Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!
-
Big Alert : ఇంటర్ సిలబస్లో కీలక మార్పులు.. కొత్త టెక్స్ట్ బుక్స్, QR కోడ్లతో డిజిటల్ లెర్నింగ్
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!