AP Riots: ఏపీలో హింసాత్మక ఘటనలు.. పోలీసు రియాక్షన్ స్టార్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Riots: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత మొదలైన గొడవల టెన్షన్ కొనసాగుతూనే ఉంది. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండడంతో పోలీసులు అలర్ట్గా ఉన్నారు. ఇక నుంచి ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో పోలీస్ పికెట్ కొనసాగుతుండగా.. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్రెడ్డితో పాటు.. కూటమి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. భద్రత మరింత పెంచారు. దేవగుడిలో ఆదినారాయణ రెడ్డి సోదరులు ఇళ్ల వద్ద పోలీసుల మోహరించారు. కొంత వారిని అనుమతించడం లేదు. ఆక్టోపస్ ఎస్పీ ఆధ్వర్యంలో భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సుధీర్ రెడ్డిని మరో ప్రాంతానికి తరలించారు.
Read Also: CM Revanth Reddy: రాష్ట్ర ఆదాయం పెంపుపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు
Also Read
- Akash Deep Wedding: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇంట పెళ్లి బాజాలు.. పూర్తి షెడ్యూల్ విడుదల
- Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ పిల్లల్ని అణచివేస్తోంది.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
- Off The Record: రెండేళ్లకే ఇలా ఎందుకు..? అధికారంలో ఉన్నవాళ్లను కంగారు పెడుతుందేంటీ..?
- Bangladesh: బంగ్లాదేశ్లో రాముడి విగ్రహ వివాదం.. రాడికల్ ఇస్లామిస్ట్ల బెదిరింపులు..
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జెడ్పీటీసీ భర్త భాను కుమార్రెడ్డి, సర్పంచ్ గణపతి రెడ్డిలతో పాటు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. అటు.. చంద్రగిరిలో ఉద్రిక్త పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. రెండు పార్టీల అభ్యర్థులను గృహ నిర్బంధంలోనే ఉంచారు పోలీసులు. మరో వైపు గన్మెన్ ధరణి ఫైరింగ్లో కాలికి బుల్లెట్ గాయమైన సుధాకర్రెడ్డిని చికిత్స కోసం చెన్నైకి తరలించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి హింసలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వైసీపీ, టీడీపీలకు చెందిన 91 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఉరవకొండ కోర్టులో హాజరు పర్చారు. వారిలో టీడీపీకి చెందిన వారు 54 మంది, వైసీపీకి చెందిన వారు 37 మంది ఉన్నారు. అటు.. కోనసీమ జిల్లాల్లో కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. వల్లూరు గ్రామ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యూదుతో కేసు నమోదు చేశారు అంగర పోలీసులు. జనసేన ఇంఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసును నమోదు చేశారు. తోట త్రిమూర్తులుతోపాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు. మొత్తానికి గురువారం చిన్న చిన్న ఘటనలు మినహా పరిస్థితి అంతా అదుపులో ఉందని తెలిపారు పోలీసులు. నిఘాను కట్టుదిట్టం చేశారు.
తాజావార్తలు
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
-
Ghaziabad Jewelry Heist: మందు పార్టీ ఇచ్చి మరీ రూ.4 కోట్లు లేపేశాడు.. ప్రియురాలి కోసం ప్రియుడు వేసిన ‘గోల్డెన్’ స్కెచ్!
-
Akash Deep Wedding: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇంట పెళ్లి బాజాలు.. పూర్తి షెడ్యూల్ విడుదల
-
Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ పిల్లల్ని అణచివేస్తోంది.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!