Satyakumar: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కలిశారు. ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి జేపీ నడ్డాతో చర్చ జరిగిందని ఆయన భేటీ అనంతరం మీడియాతో వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధత గురించి చర్చించామన్నారు. సంస్థాగతంగా పార్టీ విస్తరించేందుకు ప్రయత్నాలు చేయాలని చూస్తున్నామని.. జాతీయస్థాయిలో అధ్యక్ష మార్పులుంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో మార్పులు ఉంటాయా లేదా అన్నది తాను చెప్పలేనన్నారు.
Read Also: Venkaiah Naidu: రేవంత్ రెడ్డిని మెచ్చుకున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు..ఎందుకంటే..
ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన సత్యకుమార్.. ఎన్హెచ్ఎం కింద ప్రత్యేకంగా రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. ‘ఆరోగ్య మందిర్’ భవనాల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. 40 రోజుల పాలనలో రాష్ట్ర సర్కారు తీసుకున్న తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రులు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి తాను వివరించానని సత్యకుమార్ పేర్కొ్న్నారు.
Met with Hon’ble @JPNadda Ji, Union Health Minister, to discuss the impactful strides in development and welfare under the NDA government.
Urged for enhanced care facilities and special allocations under NHM for reorganized districts through PM ABHIM, aiming to uplift healthcare… pic.twitter.com/SA3pG8YA39
— Satya Kumar Yadav (@satyakumar_y) July 17, 2024