Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
- ఇంటర్ ఫలితాల్లో ఘోర నిర్లక్ష్యం
- గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని కావ్యకు బోటనీలో 60/60 మార్కులు
- ఓఎంఆర్ షీట్ బబ్లింగ్లో లెక్చరర్ తప్పిదం
- 60 మార్కుల స్థానంలో 6 మార్కులు నమోదు
- సంబంధిత లెక్చరర్కు రూ.7,500 జరిమానా విధించిన ఇంటర్ బోర్డు
- మూడేళ్లపాటు మూల్యాంకన విధుల నుంచి డిబార్ చేసిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Inter Results Error: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన ఘోర నిర్లక్ష్యం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థినికి బోటనీ పరీక్షలో పూర్తి మార్కులు వచ్చినప్పటికీ, మూల్యాంకనంలో జరిగిన తప్పిదం కారణంగా ఆమెను ఫెయిల్గా ప్రకటించడం కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన ఇంటర్ బోర్డు సంబంధిత లెక్చరర్పై చర్యలు తీసుకుంది.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన కర్లపూడి కావ్య ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోటనీ పరీక్ష రాసింది. పరీక్షలో ఆమెకు 60కి 60 మార్కులు వచ్చినప్పటికీ, మూల్యాంకనం చేసిన లెక్చరర్ ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ సమయంలో నిర్లక్ష్యం కారణంగా.. 60 మార్కులు నమోదు చేయాల్సిన చోట కేవలం 6 మార్కులు మాత్రమే నమోదు చేశారు. అనంతరం అదే ఓఎంఆర్ షీట్ స్కాన్ కావడంతో కంప్యూటర్ రికార్డుల్లో కూడా 6 మార్కులే నమోదయ్యాయి. ఫలితంగా పూర్తి మార్కులు సాధించిన విద్యార్థిని ఫెయిల్ అయినట్లు ఫలితాల్లో చూపించారు.
Also Read
ఈ పొరపాటు కారణంగా కావ్య దాదాపు నెల రోజుల పాటు తీవ్ర మనోవేదనకు గురైంది. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియ అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మార్చి 13న విడుదలైన సవరించిన ఫలితాల్లో ఆమెకు పూర్తి మార్కులు వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూల్యాంకనంలో ఇలాంటి నిర్లక్ష్యాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష ఫలితాలపై ఆధారపడి విద్యార్థులు ఉన్నత చదువులు, కెరీర్ నిర్ణయాలు తీసుకుంటారని, ఇలాంటి పొరపాట్లు మానసిక ఒత్తిడికి దారి తీస్తాయని చెబుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన ఇంటర్ బోర్డు సంబంధిత లెక్చరర్కు రూ.7,500 జరిమానా విధించింది. అలాగే మూడేళ్లపాటు మూల్యాంకన విధుల నుంచి డిబార్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ చర్యలు సరిపోవని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత కఠిన చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న మూల్యాంకన ప్రక్రియలో అత్యంత జాగ్రత్త అవసరమని, బాధ్యతారాహిత్యానికి తావులేకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబ’s రివెంజ్’
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
-
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!