Site icon NTV Telugu

AP High Court: అంబటి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్‌.. కీలక ఆదేశాలు జారీ

Ap High Court

Ap High Court

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్‌ అయ్యింది. అంబటి భార్య హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చేంతవరకూ భద్రత ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. టీడీపీ ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అంతకు ముందు టీడీపీ శ్రేణులు అంబటి ఇంటిపై దాడికి పాల్పడ్డాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Exit mobile version