AP High Court: ఈనెల 17న సీపీఎస్ ఉద్యోగుల ధర్నాకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 17న ధర్నా చేసుకునేందుకు సీపీఎస్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. పలు షరతులతో కూడిన అనుమతిని ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది. ఈ ధర్నాలో నల్లబ్యాడ్జీలు ధరించి సీపీఎస్ ఉద్యోగులు నిరసన తెలియజేయనున్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని మొదటి అసెంబ్లీలో ప్రకటించి మాట్లాడటం మానేసారు అంటూ సీపీఎస్ ఎంప్లాయిస్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏపీసీపీఎస్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.అప్పల్రాజు మాట్లాడుతూ.. ఈరోజు సీపీఎస్ ఉద్యోగుల పాలిట చీకటి దినం.. అన్యాయమైన గుదిబండ లాంటి సీపీఎస్ తీసుకొచ్చారు అని వ్యాఖ్యనించారు.
Read Also: CPI Narayana: ముందస్తు ఎన్నికలు జరిపితే.. మోడీ ముందే ఇంటికి పోతాడు..
Also Read
- Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
సీపీఎస్ కు వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహిస్తున్నామని ఏపీసీపీఎస్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.అప్పల్రాజు అన్నారు. సీపీఎస్ ఉద్యోగులను పలుమార్లు నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేశారు.. అన్ని జిల్లాల్లో సీపీఎస్ ఉద్యోగులపై కేసులు నమోదు చేసారు.. సీపీఎస్ కంటే దారుణమైన జీపీఎస్ తెచ్చారు.. సీపీఎస్ ఆర్డినెన్స్ లో ఏముందో మాకు చెప్పాలి.. జీపీఎస్ పేరుతో మమ్మల్ని మాయ చేయద్దు.. మభ్య పెట్టద్దు అని ఆయన అన్నారు. మా డబ్బులే తీసుకుని మాకు అందులో 50శాతం పెన్షన్ ఇస్తామనడం న్యాయం కాదు.. వృద్ధాప్యంలో మాకు బ్రతకడానికి భరోసా ఇవ్వమంటే అన్యాయం చేస్తున్నారు అని అప్పల్రాజు పేర్కొన్నారు. హైకోర్టు తీర్పులో చెప్పిన విధంగానే మేం నిరసనలు వ్యక్తం చేస్తామని ఏపీసీపీఎస్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అప్పల్రాజు అన్నారు. మాకు సీపీఎస్, జీపీఎస్ వద్దు ఓపీఎస్ మాత్రమే కావాలన్నారు.
Read Also: Varun – Lavanya : పెళ్లికి ముందే మొదలెట్టేసిన వరుణ్, లావణ్య.. పిక్స్ వైరల్..
దేశంలోని రాష్ట్రాలన్నీ ఓపీఎస్ అమలు చేస్తుంటే జీపీఎస్ ఆదర్శప్రాయంగా ఎలా అవుతుంది అని సీపీఎస్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు పాలేరు రామాంజనేయ యాదవ్ అన్నారు. మా డబ్బులు తీసుకునే వెసులుబాటు లేదు కనుక సీపీఎస్, జీపీఎస్ ఆప్షన్ ఇస్తున్నారు.. దేశంలో రాష్ట్రాలన్నీ ఒకవైపు మన రాష్ట్రం మాత్రం ఒకవైపు.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండానే ఓపీఎస్ అమలు చేశారు.. సీపీఎస్ ఉద్యోగుల వల్లనే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. 220 వారాలవుతున్నా మాకు న్యాయం జరగలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. APNGGO సంఘ నాయకులతో జీపీఎస్ బాగుందని చెప్పించడం వెనుక కుట్ర ఉంది.. ఏపీఎన్జీజీఓ సంఘానికి ప్రభుత్వం ఏమైనా ప్రత్యేకంగా హామీ ఇచ్చిందా.. ఏపీఎన్జీజీఓ నాయకులకు ముందుగా పైలట్ ప్రాజెక్టుగా జీపీఎస్ అమలు చేయండి.. వాళ్లు లబ్ధి పొందితే మేం కూడా అంగీకరిస్తాం.. ఓపీఎస్ తీసుకొచ్చేదాకా మా ఉద్యమాలు ఆగవు అంటూ పాలేరు రామాంజనేయ యాదవ్ తెలిపారు.
తాజావార్తలు
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!