Minister Kondapalli Srinivas: ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక వసతుల కల్పనపై ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kondapalli Srinivas: ఎంఎస్ఎంఈల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేయనుంది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కులలో మౌలిక వసతుల కల్పన త్వరితగతిన చేపట్టాలని, వీలైనంత త్వరగా నీరు, రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని 5వ బ్లాక్ లో ఎంఎస్ఎంఈ, ఏపీఐఐసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి… ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా ఎంఎస్ఎంఈల అభివృద్దిని వేగవంతం చేయాలని, ఇందుకు తగిన కార్యాచరణ, స్పష్టమైన భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు.
Read Also: SSMB 29 : మహేశ్ మూవీకి టైటిల్ ఇష్యూ.. రాజమౌళికి ఏం చేస్తాడో..?
Also Read
- Test Match: ఆ ప్లేయర్కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
ఇక, నూతన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే విధంగా అధికారుల పని తీరు ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహాకాలను సమర్ధవంతంగా నూతన పారిశ్రామిక వేత్తలు వినియోగించుకునే విధంగా ఎప్పటికప్పుడు పని చేయాలని, వారికి అవసరమైన చట్టపరమైన అనుమతులను జారీ చేసే విషయంలో జాప్యం చేయరాదని మంత్రి సూచించారు. నూతన పారిశ్రామిక వాడల్లో నిర్మించిన తలపెట్టిన భవనాలు, ఇతర మౌలిక వసతులపై ఈ సమీక్షా సమావేశంలో దిశా నిర్దేశం చేసారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలకు అనుగుణంగా మన పారిశ్రామిక విధానం ఉండాలని, ఇందుకోసం అవసరమైన మార్పులు చేర్పులతో వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించాలని మంత్రి కొండపల్లి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ సీఈఓ విశ్వ మనోహరన్, ఏపీఐఐసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Test Match: ఆ ప్లేయర్కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
-
Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
-
Kitchen Tips: బియ్యంలో పురుగుల నుంచి బిర్యానీ రైస్ వరకు.. వంటగది రూపురేఖలు మార్చే అమేజింగ్ చిట్కాలు!
-
Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
-
Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!