Land Mutation: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆ భూముల మ్యుటేషన్కు గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అడ్డంకులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) ఆధీనంలో ఉన్న వేల ఎకరాల భూములకు సంబంధించి ఏళ్ల తరబడి నెలకొన్న మ్యుటేషన్ సమస్యలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమారు 51,603 ఎకరాల భూములను తక్షణమే రెవెన్యూ రికార్డుల్లో (వెబ్ ల్యాండ్) ఏపీఐఐసీ పేరుతో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం..
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
- Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
చాలా కాలంగా ఏపీఐఐసీ వద్ద ఉన్న భూములు రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా నమోదు కాకపోవడం వల్ల, కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణాలు పొందడంలోనూ.. భూ బదలాయింపు ప్రక్రియలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని గమనించిన ప్రభుత్వం, పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు ఈ కీలక అడుగు వేసింది.
Also Read:Ration Card Holders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. రేపటి నుంచి కిరోసిన్ పంపిణీ..
22A జాబితా నుంచి మినహాయింపు..
మరో ప్రధానమైన అంశం ఏమిటంటే.. ఏపీఐఐసీ పరిధిలో ఉన్న సుమారు 70 వేల ఎకరాల ప్రభుత్వ భూములను నిషేధిత భూముల జాబితా (22A) నుండి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములు నిషేధిత జాబితాలో ఉండటం వల్ల పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకోవడంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భూముల వినియోగంపై ఉన్న ఆంక్షలు తొలగిపోనున్నాయి.
ఈ ప్రక్రియను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, అమలు విషయంలోనూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. భూముల మ్యుటేషన్ , 22A తొలగింపు ప్రక్రియను కేవలం 15 రోజుల్లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. యుద్ధ ప్రాతిపదికన ఈ మార్పులు చేయడం ద్వారా రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!