CM Chandrababu: ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: విశాఖపట్నంలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ- ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్కు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మారిటైమ్ లాజిస్టిక్స్ అభివృద్ధిపై దేశంలోని వివిధ పోర్టులు, కార్గో హ్యాండ్లింగ్ కంపెనీలకు చెందిన 62 మంది సీఈఓలతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దుతాం అని అన్నారు. ఏపీ మారిటైమ్ లాజిస్టిక్స్ రంగంలో ఉన్న అవకాశాలు, పోర్టు కార్గో హ్యాండ్లింగ్ మౌలిక సదుపాయాల కల్పన, రోడ్- రైలు కనెక్టివిటీలపై సమావేశంలో చర్చించారు. పోర్టుల పరిధిలో ఉన్న వివిధ ప్రాంతాలు, హింటర్ ల్యాండ్ కనెక్టివిటి, కార్గో రవాణా అంశాల గురించి మాట్లాడారు.
READ ALSO: Shivani Nagaram : కొత్త హీరోయిన్స్ చాలా మంది వచ్చి ఉండొచ్చు కానీ
Also Read
- Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
రాష్ట్రంలోని వివిధ ఓడరేవుల్లో టెర్మినళ్ల ఆధునీకరణ, కోల్డ్ చైన్ సదుపాయాలు, షిప్ బిల్డింగ్ మరమ్మతులు, ఎయిర్ కార్గో కనెక్టివిటీ అంశాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. మారిటైమ్ లాజిస్టిక్స్లో అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ప్రమాణాలు, ఏపీలో ఉన్న అవకాశాలు, పెట్టుబడుల గురించి సమావేశంలో ఆయన వివరించారు.
ప్రతీ పోర్టుకూ కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అన్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ యూనివర్శిటీ, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ త్వరలో ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు ఎయిర్ కార్గో రవాణాకు అనుకూలంగా మారుస్తామన్నారు. జీఎస్డీపీలో లాజిస్టిక్స్ రంగం వాటా 3 శాతానికి పెంచుకునే అవకాశం ఉందన్నారు. పోర్ట్ ఆధారిత ఎకానమీపైనే ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు. అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ త్వరలోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ పోర్టు ద్వారా ఇనుప ఖనిజాన్ని తెచ్చుకుంటారు. దానికి అనుబంధంగా టౌన్ షిప్, ఇతర ఆర్థిక కార్యకలాపాలు చేపట్టనున్నట్లు చెప్పారు. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం కాకినాడ సెజ్ వంటి ప్రాంతాల్లో మొత్తంగా 10 వేల ఎకరాల భూమి ఈ అవసరాల కోసం వినియోగిస్తామని పేర్కొన్నారు.
త్వరలో కంటైనర్ కార్గోగా మారాలి..
ప్రస్తుతం 90 శాతం కార్గో అంతా బల్క్లోనే ఉందని, త్వరలో కంటైనర్ కార్గోగా మారాలని చెప్పారు. దుగరాజపట్నం సహా వివిధ ప్రాంతాల్లో షిప్ బిల్డింగ్, రిపైర్లు, కంటైనర్లు, షిప్ రీసైక్లింగ్ పరిశ్రమలు పెట్టేందుకు అవకాశం ఉందన్నారు. డిజిటల్ లాజిస్టిక్స్, కార్గో ట్రాకింగ్ వంటి సాంకేతికతలు రావాలి, పోర్టులు గ్రీన్ హబ్స్గా మారాలని చెప్పారు. ఏపీలో రైల్ లింక్డ్ టెర్మినళ్లు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. లాజిస్టిక్స్ కార్పోరేషన్ను కూడా ప్రత్యేకంగా ఏపీలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. లాజిస్టిక్స్ పార్కులు, పోర్టులు, అంతర్గత జలరవాణా మార్గాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈస్ట్ కోస్ట్లో ఏపీనే అగ్రస్థానంలో ఉందని, దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు పాలసీ రూపోందిస్తామని అన్నారు. దీనికి 15-20 మందితో కూడిన సలహా బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ త్వరలోనే టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున డేటా సెంటర్లు ఇక్కడికి వస్తాయని, సీ కేబుల్ ద్వారా ఇతర ప్రపంచం కూడా విశాఖతో అనుసంధానం అవుతుందన్నారు. ప్రపంచ ప్రమాణాలతో కూడిన లాజిస్టిక్స్ హబ్గా ఏపీ మారుతుందని అన్నారు. సమావేశంలో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, డోలా బాలవీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.
READ ALSO: Krish : ఘాటి అనుష్క కెరీర్ లో ఐకానిక్ మూవీ.. ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు!
తాజావార్తలు
-
Huawei MateBook Pro S: హువావే మేట్బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్టాప్.. Kirin XE90 ప్రాసెసర్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!