Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Global Logistics Hub Chandrababu Naidu Visakhapatnam Summit

CM Chandrababu: ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

Published Date :September 2, 2025 , 4:57 pm
By Shiva Ganesh
CM Chandrababu: ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: విశాఖపట్నంలో గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్సఫర్మేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ- ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్‌కు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మారిటైమ్ లాజిస్టిక్స్ అభివృద్ధిపై దేశంలోని వివిధ పోర్టులు, కార్గో హ్యాండ్లింగ్ కంపెనీలకు చెందిన 62 మంది సీఈఓలతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం అని అన్నారు. ఏపీ మారిటైమ్ లాజిస్టిక్స్ రంగంలో ఉన్న అవకాశాలు, పోర్టు కార్గో హ్యాండ్లింగ్ మౌలిక సదుపాయాల కల్పన, రోడ్- రైలు కనెక్టివిటీలపై సమావేశంలో చర్చించారు. పోర్టుల పరిధిలో ఉన్న వివిధ ప్రాంతాలు, హింటర్ ల్యాండ్ కనెక్టివిటి, కార్గో రవాణా అంశాల గురించి మాట్లాడారు.

READ ALSO: Shivani Nagaram : కొత్త హీరోయిన్స్ చాలా మంది వచ్చి ఉండొచ్చు కానీ

రాష్ట్రంలోని వివిధ ఓడరేవుల్లో టెర్మినళ్ల ఆధునీకరణ, కోల్డ్ చైన్ సదుపాయాలు, షిప్ బిల్డింగ్ మరమ్మతులు, ఎయిర్ కార్గో కనెక్టివిటీ అంశాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. మారిటైమ్ లాజిస్టిక్స్‌లో అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ప్రమాణాలు, ఏపీలో ఉన్న అవకాశాలు, పెట్టుబడుల గురించి సమావేశంలో ఆయన వివరించారు.
ప్రతీ పోర్టుకూ కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అన్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ యూనివర్శిటీ, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ త్వరలో ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు ఎయిర్ కార్గో రవాణాకు అనుకూలంగా మారుస్తామన్నారు. జీఎస్డీపీలో లాజిస్టిక్స్ రంగం వాటా 3 శాతానికి పెంచుకునే అవకాశం ఉందన్నారు. పోర్ట్ ఆధారిత ఎకానమీపైనే ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు. అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ త్వరలోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ పోర్టు ద్వారా ఇనుప ఖనిజాన్ని తెచ్చుకుంటారు. దానికి అనుబంధంగా టౌన్ షిప్, ఇతర ఆర్థిక కార్యకలాపాలు చేపట్టనున్నట్లు చెప్పారు. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం కాకినాడ సెజ్ వంటి ప్రాంతాల్లో మొత్తంగా 10 వేల ఎకరాల భూమి ఈ అవసరాల కోసం వినియోగిస్తామని పేర్కొన్నారు.

త్వరలో కంటైనర్ కార్గోగా మారాలి..
ప్రస్తుతం 90 శాతం కార్గో అంతా బల్క్‌లోనే ఉందని, త్వరలో కంటైనర్ కార్గోగా మారాలని చెప్పారు. దుగరాజపట్నం సహా వివిధ ప్రాంతాల్లో షిప్ బిల్డింగ్, రిపైర్లు, కంటైనర్లు, షిప్ రీసైక్లింగ్ పరిశ్రమలు పెట్టేందుకు అవకాశం ఉందన్నారు. డిజిటల్ లాజిస్టిక్స్, కార్గో ట్రాకింగ్ వంటి సాంకేతికతలు రావాలి, పోర్టులు గ్రీన్ హబ్స్‌గా మారాలని చెప్పారు. ఏపీలో రైల్ లింక్డ్ టెర్మినళ్లు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. లాజిస్టిక్స్ కార్పోరేషన్‌ను కూడా ప్రత్యేకంగా ఏపీలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. లాజిస్టిక్స్ పార్కులు, పోర్టులు, అంతర్గత జలరవాణా మార్గాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈస్ట్ కోస్ట్‌లో ఏపీనే అగ్రస్థానంలో ఉందని, దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు పాలసీ రూపోందిస్తామని అన్నారు. దీనికి 15-20 మందితో కూడిన సలహా బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ త్వరలోనే టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున డేటా సెంటర్లు ఇక్కడికి వస్తాయని, సీ కేబుల్ ద్వారా ఇతర ప్రపంచం కూడా విశాఖతో అనుసంధానం అవుతుందన్నారు. ప్రపంచ ప్రమాణాలతో కూడిన లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ మారుతుందని అన్నారు. సమావేశంలో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, డోలా బాలవీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.

READ ALSO: Krish : ఘాటి అనుష్క కెరీర్ లో ఐకానిక్ మూవీ.. ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh maritime logistics
  • AP 2047 vision
  • AP global logistics hub
  • AP port development
  • cargo handling infrastructure AP

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions