AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది తొలగింపు.. త్వరలో మరో 200 మంది!
- ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం
- ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది తొలగింపు
- వైసీపీ హయాంలో అక్రమ నియామకాలు జరిగాయని జీవీ రెడ్డి కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు ఉండటంతో కార్పొరేషన్లో 410 మంది ఉద్యోగులను తొలగించే విధంగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫైబర్ నెట్లో 410 మంది ఉద్యోగులను తొలగించటానికి నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఫైబర్ నెట్లో 2016-19 మధ్య 108 ఉద్యోగులతో నడిపామని.. 10 లక్షల కనెక్షన్లు అప్పట్లో ఉన్నాయని.. 2019-24 మధ్య వైసీపీ సమయంలో ఉద్యోగులను 1360కి పెంచారని.. ఫైబర్ నెట్ సంస్థ బిజినెస్ పెరగలేదు, నష్టాలు వచ్చాయని ఆయన తెలిపారు. కనెక్షన్లు ఐదు లక్షలకు పడిపోయాయని జీవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో వచ్చిన ఉద్యోగులు అందరూ ఎంపీ అవినాష్ రెడ్డి సహా మరికొందరు నేతల సిఫార్సుతో వచ్చారని.. అవసరం లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిపారని ఆయన విమర్శించారు. ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ కూడా లేకుండా ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు.
Read Also: APSRTC Chairman: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై గుడ్న్యూస్!
Also Read
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
లీగల్ సర్వీస్ కూడా మొత్తం పరిశీలించామని ఆయన తెలిపారు. ఉద్యోగస్తుల విషయంలో ఇబ్బంది లేదని.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఉద్యోగులను మాత్రమే తొలగిస్తున్నామన్నారు. అడ్డగోలుగా తొలగించటం చేయటం లేదన్నారు. ఎగ్జిట్ ఫార్మాట్ ద్వారా ప్రొసీజర్ ద్వారా మాత్రమే ఉద్యోగుల తొలగింపు చేస్తున్నామన్నారు. 410 మంది ఉద్యోగులను ప్రొసీజర్ ప్రకారం మాత్రమే తొలగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఉద్యోగాలు ఇక్కడ ఉంటాయి తప్ప.. ఉద్యోగులు ఎక్కడో ఉంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్షతో ఉద్యోగాలు తొలగించటం లేదన్నారు. ప్రొసీజర్ ప్రకారం నియామకాలు జరగటం లేదని.. 2 వేల కోట్లకు పైగా అప్పులు సంస్థకు ఉన్నాయని మండిపడ్డారు. ఉద్యోగం తొలగింపుకు గురైన వారు ఎక్కువ చేస్తే వారి నుంచి జీతాల రికవరీతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. జీతాలు ఇచ్చిన వారు ఎవరైనా వివరణ కోసం నోటీసు ఇస్తామన్నారు. మాజీ ఎండీ నుంచి రికవరీ చేయటానికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: CP Avinash Mohanty : ఈ ఏడాది 70 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల నుంచి బాధితులకు రిఫండ్ చేసి ఇచ్చాం..
రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా చెల్లింపులపై ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి రాంగోపాల్ వర్మకు రూ.1కోటి15లక్షల రూపాయలు అక్రమంగా చెల్లించారని అన్నారు. రాంగోపాల్ వర్మ కు నోటీసులు ఇచ్చి డబ్బు చెల్లించేందుకు 15రోజులు సమయం ఇచ్చామన్నారు. నిర్ణీత గడువులోగా డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. మరో 200 మంది ఉద్యోగుల అపాయింట్మెంట్లను పరిశీలిస్తున్నామని.. 200 మంది ఉద్యోగులను మరికొద్దిరోజుల్లో తొలగింపునకు చర్యలు ఉంటాయన్నారు. ఏపీ ఫైబర్ నెట్ను ప్రక్షాళన చేస్తున్నామని ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!