AP DGP: ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే లక్ష్యం!
- గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే లక్ష్యం
- సీసీ కెమెరాలు ఏర్పాటుపై దృష్టి
- చెక్ పోస్టుల వద్ద తనిఖీలు పెంచాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే తమ లక్ష్యం అని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి ఈగల్ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసి.. ఐజీ అధికారిని నియమించామన్నారు. నేరాల నియంత్రణలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకునేలా.. మార్చి ఒకటి నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు లక్ష్యంగా దృష్టి సారించామన్నారు. ఒడిస్సా సరిహద్దు మల్కాజ్గిరి ప్రాంతంలో గంజాయి సాగు ఉందని, గంజాయి పండించే గిరిజనులకు చైతన్య వంతం చేస్తున్నాం అని డీజీపీ చెప్పారు. పోలీసులు ఇటీవల సంకల్పం పేరిట మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించి.. కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
అనకాపల్లిలో డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ… ‘ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే లక్ష్యం. గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఐజీ అధికారిని నియమించాం. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు పెంచాం. ఏజెన్సీలో గంజాయి పంటని డ్రోన్స్ సాయంతో ధ్వంసం చేసే పనులు జరుగుతున్నాయి. ఒడిస్సా సరిహద్దు మల్కాజ్గిరి ప్రాంతంలో గంజాయి సాగు ఉంది. గంజాయి పండించే గిరిజనులకు చైతన్య వంతం చేస్తున్నాం. గంజాయి మహమ్మారికి బానిసలుగా మారోద్దని యువతకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సంకల్ప రథాలు ద్వారా ప్రచారం చేస్తున్నాం’ అని చెప్పారు.
Also Read
‘సైబర్ క్రైమ్ దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశం. దీనిని ఎలా అదుపు చేయాలనే దానిపై ఆలోచిస్తున్నాం. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని భావిస్తున్నాం. నేరాల నియంత్రణలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకునేలా మార్చి ఒకటి నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు లక్ష్యంగా దృష్టి సారించాం. సీసీ కెమెరాలను దాతల, ప్రజల సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా.. ఏదో ఒక కెమెరాలో రికార్డు కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల హాట్ స్పాట్లను గుర్తించాం. రెండు లక్షల సీసీ కెమెరాలను ఆ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. పోలీసులు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందజేయాలి. రాష్ట్ర మొత్తంగా క్రైమ్ రేట్ తగ్గడం అభినందించదగ్గ విషయం’ అని డీజీపీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!