CS Review on Elections: ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష.
CS Review on Elections: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సన్నద్ధతపై సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జనవరి 31వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై సమీక్ష చేపట్టారు. బదిలీల అనంతరం వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. ఇప్పటి వరకు వివిధ శాఖలకు చెందిన సుమారు 2 వేల మందిని బదిలీ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీలు తదితర అంశాలపైనా సీఎస్ సమీక్ష నిర్వహించారు. సీఎస్తో సమీక్షకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు సీఈఓలు హాజరయ్యారు.
Read Also: Andhrapradesh: జిల్లాల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల
Also Read
- Sunrisers Hyderabad: సన్రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!
- IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Muskmelon Health Risks: కర్బూజా కొనుగోలు చేసే ముందు.. తినకూడని వారు ఎవరు? ముఖ్య జాగ్రత్తలు
- AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
సీఈసీ ఆదేశాలకు అనుగుణంగా రానున్న ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా జిల్లాల్లో వచ్చే జూన్ నాటికి ఒకే ప్రాంతంలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకునే ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులను ఈనెల 25లోగా తప్పని సరిగా బదిలీ చేయాలని ఆయా శాఖల అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన కనీస సౌకర్యాలు ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులైన ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేయాల్సిన ర్యాంపులు వంటి సౌకర్యాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యా, తదితర శాఖల అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణా నియంత్రణతో పాటు పటిష్ట నిఘాకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టుల ఏర్పాటును తక్షణం పూర్తి చేయాలని సీఎస్ పోలీస్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఎక్సైజ్, తదితర శాఖల అధికారులను ఆదేశించారు.
ఈసమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ.. ఎన్నికల విధులతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకునే శాఖల అధికారులు, సిబ్బందిని బదిలీ చేయాల్సిన వారిని గుర్తించగా.. ఇప్పటికే కొన్ని శాఖల్లో బదిలీలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీస్ శాఖల్లో బదిలీ చేయాల్సిన వారిని గుర్తించగా.. మూడు రోజుల్లో వారిని బదిలీ చేయాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు సీఈవో మీనా సూచించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, శాంతి భద్రతల అదనపు డీజీపీ ఎస్.బాగ్చి, సీడీఎంఏ వివేక్ యాదవ్, సెబ్ డైరెక్టర్ ఎం.రవిప్రకాశ్, ఐజీ రవీంద్ర బాబు, అదనపు సీఇవో కోటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, నిషాంతి, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Sunrisers Hyderabad: సన్రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!
-
IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
Muskmelon Health Risks: కర్బూజా కొనుగోలు చేసే ముందు.. తినకూడని వారు ఎవరు? ముఖ్య జాగ్రత్తలు
-
Heinrich Klaasen: ఇక ‘డాడీ డ్యూటీ’ మొదలవుతుంది.. ఎస్ఆర్హెచ్ హీరో క్లాసెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?