Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Cm Ys Jaganmohan Reddy Speech In Memantha Siddham Meeting At Naidupeta

CM YS Jagan: జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తాం.. దానిపైనే మొదటి సంతకం!

Published Date :April 4, 2024 , 6:14 pm
By Mahesh Jakki
CM YS Jagan: జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తాం.. దానిపైనే మొదటి సంతకం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM YS Jagan: ఏపీలో ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నాయుడుపేట జన సముద్రాన్ని తలపిస్తోందని సీఎం అన్నారు. మరో ఐదు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు తిరుగుతున్న ఎన్నికలు కాదని.. అందరి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలు అంటూ ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కుటుంబంలోని ప్రతి ఒక్కరి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలని ఆయన వెల్లడించారు. జగన్‌ను ఓడించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని.. ఈ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య జరుగుతున్నాయన్నారు. ఒక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దన్నవారికి..ఇంగ్లీష్ మీడియంతో పాటు నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చిన మనకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.

Read Also: YSRCP: వైసీపీకి షాక్.. పార్టీకి ఆమంచి కృష్ణమోహన్ గుడ్‌బై

పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే సమతుల్యం దెబ్బతింటుందని కోర్టును ఆశ్రయించారని సీఎం జగన్ మండిపడ్డారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించామని.. వీరిని విస్మరించిన వారికి, ఆదరించిన వారికి మధ్య ఎన్నికల జరుగుతున్నాయన్నారు. ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా అర్హులకు లబ్ధిని చేకూర్చామని సీఎం తెలిపారు. పెన్షన్లను ఇంటికే వచ్చి ఇచ్చామన్నారు. ఇప్పుడు యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో చూస్తున్నామన్నారు. ప్రతి నెల ఒకటిన వాలంటీర్లు నేరుగా ఇంటికి వచ్చి అవ్వా తాతలకు పెన్షన్లను 58 నెలలగా ఇచ్చామని.. ఎన్నికలు రావడంతో జీర్ణించుకోలేక అసూయతో చంద్రబాబు తనకు సంబంధించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించారని ముఖ్యమంత్రి చెప్పారు. 2019 ఎన్నికలకు ముందు 1000 రూపాయలుగా ఉన్న పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచామన్నారు. అందరూ ఆలోచన చేయాలని కోరుతున్నామన్నారు సీఎం జగన్.

Read Also: Andhra Pradesh: ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు నియామకం

పేదల భవిష్యత్తు కోసం పోరాడేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయని.. చెడిపోయాయని.. అవ్వా తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే పెన్షన్‌ను ఆపించారని మండిపడ్డారు. టీడీపీ నేత ఆదిరెడ్డి వాసునే ఈ విషయాన్ని చెప్పారన్నారు. ఇలాంటి దుర్మార్గం వల్లే 31 మంది అవ్వ తాతలు నడవలేక అవస్థలు పడలేక ప్రాణాలు విడిచారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లోనే ఇంతమంది మరణించడం బాధాకరమన్నారు. 31 మంది మరణానికి కారణమైన చంద్రబాబును హంతకుడిని అందామా అంటూ ప్రశ్నించారు. రెండు నెలలు ఓపిక పట్టాలని.. జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి ఇంటింటికి సేవలు అందించే కార్యక్రమంపైన మొదటి సంతకం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. చంద్రబాబు హయంలో జన్మభూమి కమిటీలు ఏ విధంగా పని చేశాయో అందరూ చూశారని.. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా పని చేసిందో ప్రజలు చూశారన్నారు. దీన్ని చూసి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP CM YS Jaganmohan Reddy
  • AP Elections 2024
  • CM YS Jagan
  • Memantha Siddham Meeting

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions