CM YS Jagan: అంబేడ్కర్ మహా శిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఎల్లుండి విజయవాడలో అంబేడ్కర్ మహా శిల్పం ఆవిష్కరణ జరగనుంది. సీఎం జగన్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరగనుది. ఈ సందర్భంగా సీఎం జగన్ అంబేడ్కర్ విగ్రహం గురించి మాట్లాడారు. విజయవాడలో ఏర్పాటు చేసుకున్న అంబేడ్కర్ మహా శిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికమని ఆయన వ్యాఖ్యానించారు. ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని, సామాజిక న్యాయ’మహా శిల్పమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. ఈ నెల 19న, చారిత్రక, స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతున్నామని వెల్లడించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహమని ఆయన తెలిపారు.
Read Also: AAG Sudhakar Reddy: చంద్రబాబు పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది: అదనపు అడ్వొకేట్ జనరల్
Also Read
81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన… 125 అడుగుల మహా శిల్పం.. మొత్తంగా 206 అడుగుల ఎత్తైన విగ్రహమని సీఎం స్పష్టం చేశారు. ఆ మహానుభావుడిది ఆకాశమంతటి వ్యక్తిత్వమని, ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రల్ని మార్చేలా అంబేడ్కర్ భావజాలం ఉందన్నారు. దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయన్నారు. బాధ్యతతో, ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో ప్రభుత్వం అనుసరించిందన్నారు. ఈ నెల 19వ తేదీన విగ్రహ ఆవిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని సీఎం ప్రజలకు సూచించారు.
Read Also: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన
అంటరానితనం, ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన మహానుభావుడు అంబేడ్కర్ అని ఆయన చెప్పారు. సమ సమాజ భావాలకు నిలువెత్తు రూపం.. రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి.. ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం.., అణగారిన వర్గాలకు నిరంతరం.., ధైర్యాన్ని, అండని ప్రసాదించే ఓ మహా స్ఫూర్తి అంబేడ్కర్ అంటూ సీఎం కొనియాడారు. దళితులతో పాటు కులాలు, మతాలకు అతీతంగా, పేదలందరి జీవితాల్లో వెలుగులు నింపారని అంబేడ్కర్ గొప్పదనాన్ని ముఖ్యమంత్రి కీర్తించారు. ఈ 77 సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు మూలం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భావాలు అంటూ సీఎం జగన్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Jana Nayagan: ఎట్టకేలకు పూర్తయిన జన నాయగన్ సెన్సార్.. ఆరోజు రిలీజ్
-
TMC Crisis: మమతా బెనర్జీకి షాక్.. బీజేపీలోకి మాజీ టీఎంసీ ఎంపీలు..
-
CJP: పార్లమెంట్ మార్చ్.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలు పూర్తి.. ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతులకు భారీ ఊరట..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!