Tirumala Brahmotsavam 2023: బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్.. పట్టువస్త్రాలు సమర్పణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Brahmotsavam 2023: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున స్వామివారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలు సమర్పించేందుకు బేడి ఆంజనేయ స్వామి గుడి నుంచి బయల్దేరిన సీఎం జగన్.. ఆలయంలోకి రాగానే పరివట్టం కట్టారు ఆలయ ప్రధాన అర్చకులు. పట్టువస్త్రాలు సమర్పించాక అర్చకులు ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ 2024 కేలండర్, డైరీ ఆవిష్కరించారు సీఎం జగన్. పెదశేష వాహనంలో పాల్గొన్న తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
ఇక, గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. నిన్న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరిగింది. ఇవాళ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలను సమర్పించారు.. తిరుమల వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను కనులార తిలకించేందుకు తరలి వచ్చిన భక్తులతో కిక్కిరిపోయింది. శ్రీవారికి పెద్ద శేషవాహన సేవ జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామి ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.. మరోవైపు.. బ్రహ్మోత్సవాల్లో రోజూ లక్ష మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తారని అంచనా. దీంతో లక్ష మందికి అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు జరిగే గరుడ సేవకు రెండు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని TTD అధికారులు అంచనా వేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ స్వామివారి అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది TTD. ఈ నెల 26న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
Also Read
- CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
https://www.youtube.com/watch?v=75G2sO8-sqc
తాజావార్తలు
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
-
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!