Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Cm Chandrababu On Two Women Assaulted Case In Sri Satyasai District

CM Chandrababu: అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఘటనపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ

Published Date :October 14, 2024 , 9:02 pm
By Mahesh Jakki
  • శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఘటనపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ
  • కఠిన చర్యలతో మహిళలపై నేరాలకు అడ్డుకట్ట
  • అత్యాచార ఘటనపై డీజీపీ..ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష
CM Chandrababu: అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఘటనపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: మహిళలపై నేరాలు చేసేవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో నిందితులకు ఖచ్చితంగా, వేగంగా శిక్ష పడేలా దర్యాప్తు సాగాలని సిఎం ఆదేశించారు. మహిళలపై నేరాలకు పాల్పడితే శిక్ష తప్పదనే భయం నేరగాళ్లలో రావాలని చంద్రబాబు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్ళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా, చిలమత్తూరు మండలం, నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడళ్లపై సమూహిక అత్యాచార ఘటనలో జరుగుతున్న విచారణపై సమీక్షించారు. ఈ ఘటనలో నిందితులకు తక్షణం శిక్షలు పడేలా చేయాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కేసును విచారించాలని అన్నారు. దీని కోసం హైకోర్టుకు విన్నవించి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి, మహిళలకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీనితో పాటు గతంలో బాపట్ల జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనపైనా ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపించి నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలని సీఎం అన్నారు.

Read Also: Minister Kollu Ravindra: పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి

లైంగిక వేధింపులు, మహిళలపై దాడి వంటి అంశాలపై కఠినంగా వ్యవహరించి త్వరగా న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ విధానం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఘటనకు సంబంధించి ఇప్పటికే పలు కీలక అంశాలను దర్యాప్తు బృందం రాబట్టిందన్నారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు దొంగతనాలకు పాల్పడుతుండటంతో పాటు అత్యాచారాలకు పాల్పడతారన్న అంశం విచారణలో తేలిందన్నారు. నేరగాళ్లను గుర్తించడానికి, కట్టడి చేయడానికి, కఠినంగా శిక్షలు వేయడానికి టెక్నాలజీ ద్వారా సాక్ష్యాలను సేకరించాలని సిఎం అధికారులకు ఆదేశించారు. నేరస్తులను పట్టుకోవడంలో సిసి కెమేరాలు సహా అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక అంశాలను వాడుకోవాలని సూచించారు. నేరస్తులను వెంటనే గుర్తించే వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని సిఎం అన్నారు. ఇప్పటికే ఉన్న సీసీటీవీ కెమెరాలను పూర్తిగా అందుబాటులోకి తేవడంతో పాటు కొత్తవాటిని ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. అదే విధంగా నేరాలను అరికట్టేందుకు ప్రజల సహకారం కూడా తీసుకోవాలని…..ఎక్కడైనా లైంగిక వేధింపులు, ఘర్షణలు, వివాదాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఆ సమాచారాన్ని, వాటికి తగ్గ ఆధారాలును పోలీసులతో పంచుకోవాలని సీఎం కోరారు.

ప్రజల సహకారంతో నేరాల అడ్డుకట్ట మరింత సమర్థవంతంగా చేయవచ్చని సిఎం అన్నారు. పోలీసులకు సమాచారం పంపిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామనే నమ్మకాన్న కూడా పోలీసు శాఖ కల్పించాలని సిఎం అన్నారు. ఈ విషయంలో అపోహలు తొలగించి ప్రజల సహకారం తీసుకోవాలని సిఎం సూచించారు. ప్రజల ప్రాణాలకు, మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ప్రతి వ్యక్తికి, ప్రతి మహిళ స్వేచ్ఛగా తిరిగేలా రాష్ట్రంలో శాంతి భద్రతలు కల్పించేందుకు అవసరమైన ప్రతి చర్య తీసుకుంటామని సిఎం చంద్రబాబు అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP CM Chandrababu
  • crimes in ap
  • special court
  • Sri Satyasai District

తాజావార్తలు

  • US-Iran War: హార్ముజ్ తెరిస్తే కాల్పుల విరమణ.. యూఎస్-ఇరాన్ చర్చలు..!

  • Liquor Sales: భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు.. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఎంత తాగేశారంటే..?

  • Stock Market: నేటి స్టాక్ మార్కెట్.. నష్టాల నుంచి లాభాల్లోకి ఇలా..

  • Amaravati Capital Bill: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

  • Karnataka: ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions