CM Chandrababu: అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఘటనపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ
- శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఘటనపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ
- కఠిన చర్యలతో మహిళలపై నేరాలకు అడ్డుకట్ట
- అత్యాచార ఘటనపై డీజీపీ..ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మహిళలపై నేరాలు చేసేవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో నిందితులకు ఖచ్చితంగా, వేగంగా శిక్ష పడేలా దర్యాప్తు సాగాలని సిఎం ఆదేశించారు. మహిళలపై నేరాలకు పాల్పడితే శిక్ష తప్పదనే భయం నేరగాళ్లలో రావాలని చంద్రబాబు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్ళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా, చిలమత్తూరు మండలం, నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడళ్లపై సమూహిక అత్యాచార ఘటనలో జరుగుతున్న విచారణపై సమీక్షించారు. ఈ ఘటనలో నిందితులకు తక్షణం శిక్షలు పడేలా చేయాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కేసును విచారించాలని అన్నారు. దీని కోసం హైకోర్టుకు విన్నవించి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి, మహిళలకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీనితో పాటు గతంలో బాపట్ల జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనపైనా ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపించి నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలని సీఎం అన్నారు.
Read Also: Minister Kollu Ravindra: పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి
Also Read
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
లైంగిక వేధింపులు, మహిళలపై దాడి వంటి అంశాలపై కఠినంగా వ్యవహరించి త్వరగా న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ విధానం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఘటనకు సంబంధించి ఇప్పటికే పలు కీలక అంశాలను దర్యాప్తు బృందం రాబట్టిందన్నారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు దొంగతనాలకు పాల్పడుతుండటంతో పాటు అత్యాచారాలకు పాల్పడతారన్న అంశం విచారణలో తేలిందన్నారు. నేరగాళ్లను గుర్తించడానికి, కట్టడి చేయడానికి, కఠినంగా శిక్షలు వేయడానికి టెక్నాలజీ ద్వారా సాక్ష్యాలను సేకరించాలని సిఎం అధికారులకు ఆదేశించారు. నేరస్తులను పట్టుకోవడంలో సిసి కెమేరాలు సహా అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక అంశాలను వాడుకోవాలని సూచించారు. నేరస్తులను వెంటనే గుర్తించే వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని సిఎం అన్నారు. ఇప్పటికే ఉన్న సీసీటీవీ కెమెరాలను పూర్తిగా అందుబాటులోకి తేవడంతో పాటు కొత్తవాటిని ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. అదే విధంగా నేరాలను అరికట్టేందుకు ప్రజల సహకారం కూడా తీసుకోవాలని…..ఎక్కడైనా లైంగిక వేధింపులు, ఘర్షణలు, వివాదాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఆ సమాచారాన్ని, వాటికి తగ్గ ఆధారాలును పోలీసులతో పంచుకోవాలని సీఎం కోరారు.
ప్రజల సహకారంతో నేరాల అడ్డుకట్ట మరింత సమర్థవంతంగా చేయవచ్చని సిఎం అన్నారు. పోలీసులకు సమాచారం పంపిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామనే నమ్మకాన్న కూడా పోలీసు శాఖ కల్పించాలని సిఎం అన్నారు. ఈ విషయంలో అపోహలు తొలగించి ప్రజల సహకారం తీసుకోవాలని సిఎం సూచించారు. ప్రజల ప్రాణాలకు, మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ప్రతి వ్యక్తికి, ప్రతి మహిళ స్వేచ్ఛగా తిరిగేలా రాష్ట్రంలో శాంతి భద్రతలు కల్పించేందుకు అవసరమైన ప్రతి చర్య తీసుకుంటామని సిఎం చంద్రబాబు అన్నారు.
తాజావార్తలు
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?