AP CID: ఏపీబీసీఎస్లో అవకతవకల ఆరోపణలపై సీఐడీ ఫోకస్
- మద్యం అక్రమాలపై ముమ్మరంగా సీఐడీ దర్యాప్తు
- ఏపీబీసీఎస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అక్రమాలపై కూపీ లాగుతున్న సీఐడీ
- వాసుదేవరెడ్డి పాత్రపై వెలుగులోకి వస్తున్న సంచలన వాస్తవాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CID: గత ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలపై సీఐడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఏపీబీసీఎస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అక్రమాలపై సీఐడీ కూపీ లాగుతోంది. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు.. అక్రమాలు జరిగిన తీరుపై నాటి ఉన్నతాధికారుల నుంచి వివరాలను సీఐడీ తీసుకుంటోంది. వాసుదేవరెడ్డి పాత్రపై సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీబీసీఎల్ ఎండీతో పాటు, డిస్టలరీల కమిషనర్ గానూ వాసుదేవ రెడ్డికే గత ప్రభుత్వం బాధ్యతలు కట్టబెట్టింది. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్లకు ఫైళ్లు పంపకుండా నిర్ణయాలు తీసుకునేలా వాసుదేవ రెడ్డికే అధికారాలు ఇచ్చింది.
ట్రాన్సఫర్లు చేయించేస్తానంటూ ఉన్నతాధికారులను బెదిరించారని వాసుదేవరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. మద్యం కొనుగోళ్లలోనూ భారీగా అవకతవకలకు వాసుదేవ రెడ్డి తెరలేపినట్లు తెలిసింది. ఒకే బ్రాండ్ మద్యాన్ని తెలంగాణ కంటే అధిక ధరకు కొనుగోలు చేసినట్టు విచారణలో సీఐడీ గుర్తించింది. ఒక్క వాసుదేవ రెడ్డి అవినీతే లెక్కలకు అందటం లేదని సీఐడీ అంటోంది. బినామీ పేర్లతో కొన్ని డిస్టిలరీల్లోకి వాసుదేవ రెడ్డి చొరబడినట్లు సీఐడీ పేర్కొంటోంది. కొన్ని మద్యం బ్రాండ్లను రాత్రికి రాత్రే తప్పించినట్లు గుర్తించింది.
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
Read Also: Microsoft Windows outage: గన్నవరం విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు ఆలస్యం
తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్లను గత సర్కారు గణనీయంగా తగ్గించేసినట్లు సీఐడీ గుర్తించింది. 2014-2019 మధ్యలో తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్లు 32 అందుబాటులో ఉంటే వాటిని రెండు బ్రాండ్లకే కుదించింది. . వాటిని అధిక ధరలకు విక్రయించి గత ప్రభుత్వం సొమ్ము చేసుకున్నట్లు సీఐడీ అధికారులు ఆరోపించారు. ప్రముఖ బ్రాండ్ల పేర్లతో పోలిన పేర్లు వచ్చేలా సొంత బ్రాండ్లను గత ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు సీఐడీ ఆరోపించింది. సొంత బ్రాండ్ల మద్యానికి అధిక ధరల ఎమ్మార్పీలను నిర్ధారించినట్లు సీఐడీ తెలిపింది. సబ్ లీజుల పేరుతో డిస్టిలరీలను జగన్ సన్నిహితులు కైవసం చేసుకున్నట్లు.. 11 డిస్టిలరీలను జగన్ అనుచరులు హస్తగతం చేసుకున్నట్టు విచారణలో గుర్తించినట్లు సీఐడీ ఆరోపించింది. హస్తగతం చేసుకున్న డిస్టిలరీల నుంచే 65 శాతం మేర మద్యాన్ని ఏపీలో కొనుగోళ్లకు వాసుదేవరెడ్డి అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. 2014-19 మధ్య కాలం లో ఉన్న టాప్ 5 మద్యం బ్రాండ్ మద్యాన్ని 2019 తర్వాత కొనుగోళ్లు నిలిపివేశారని సీఐడీ పేర్కొంది. మద్యం ఆదాయాన్ని ఏపీఎస్డీసీకి రూ. 14,276 కోట్లు మళ్లించినట్టు గుర్తించింది.
తాజావార్తలు
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!