AP Cabinet: 31 ప్రాజెక్టులు.. రూ.39,436 కోట్లు.. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు..!
- రేపు ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం
- రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం ఇవ్వనున్న కేబినెట్
- 16వ SIPBలో చర్చించిన పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet: ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం (ఏప్రిల్ 10)న జరగనున్న క్యాబినెట్ సమావేశం జరగనుంది. రాజధాని అమరావతి కేంద్రంగా ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పార్లమెంట్లో అమరావతి రాజధాని చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే అంశం క్యాబినెట్ అజెండాలో ఉండే అవకాశం ఉంది. రాజధాని అభివృద్ధి, నిర్మాణ పనులపై సమగ్రంగా చర్చించనున్నారు.
IPL Trophy: తొలి టైటిల్ కోసం ఎదురుచూపులు.. ఆర్సీబీనే కాదు, చెన్నై-ముంబైకి తప్పని నిరీక్షణ!
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
- Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
- OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
ఇక పెట్టుబడుల విషయానికి వస్తే 16వ SIPB సమావేశంలో చర్చించిన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.39,436 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న క్వాంటమ్ వ్యాలీలో మూడు సంస్థల ఏర్పాటు ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా హైటెక్ రంగంలో పెట్టుబడులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగనున్నాయి.
Dale Steyn: చాలా పెద్ద తప్పు చేశాడు.. మిల్లర్ పై విరుచుకపడ్డ డేల్ స్టెయిన్..!
విద్యా రంగంలో కీలకంగా భావిస్తున్న ఫీజు రెగ్యులేటరీ కమిటీ (FRC) ఏర్పాటు ఆర్డినెన్స్కు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇది ఉపశమనం కలిగించే నిర్ణయంగా నిలవనుంది. అదేవిధంగా పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. మొత్తంగా రేపటి క్యాబినెట్ సమావేశం రాష్ట్ర అభివృద్ధి దిశను నిర్ణయించే కీలక భేటీగా నిలవనుంది.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!