AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: అమరావతిలో రేపు ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా అమరావతి అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, భూ కేటాయింపులు వంటి అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
60వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఇప్పటికే వివిధ అంశాలకు ఆమోదం లభించిన నేపథ్యంలో, వాటికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి రూ.1208.41 కోట్ల వ్యయం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే సచివాలయం, జీఏడీ, హెచ్ఓడీ టవర్లలో ఫాసేడ్, గ్లేజింగ్, క్లాడింగ్ పనులకు రూ.2540 కోట్ల ఖర్చుకు కూడా అనుమతి ఇవ్వనుంది.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
- Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
- AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
- Ashwin: "కోహ్లీ కంటే బుమ్రానే బెటర్".. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
ఇంకా ఆంధ్రప్రదేశ్ శాసనసభ భవనంలో సివిల్ స్ట్రక్చర్ పనుల కోసం రూ.798 కోట్లను మంజూరు చేసే అంశం కూడా చర్చకు రానుంది. ఎల్పీఎస్ జోన్-11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధానిలో 220 KV విద్యుత్ లైన్ల రీరూటింగ్ అంశం కూడా అజెండాలో ఉంది.
రెండో దశ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, పెన్షన్ మంజూరుకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయడం కూడా కేబినెట్ పరిశీలించనుంది. మెట్ట భూములకు ఎకరాకు రూ.40 వేలుగా, జరీబు భూములకు రూ.60 వేలుగా కౌలు పెంపును ఆమోదించే అవకాశం ఉంది. అదనంగా ప్రతి సంవత్సరం మెట్ట భూములకు రూ.3000 చొప్పున, జరీబు భూములకు రూ.5000 చొప్పున పదేళ్ల పాటు పెంపు ఇవ్వాలనే ప్రతిపాదనపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అమరావతిలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపుల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు అఫ్ ఇండియాకు 1.78 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే స్వామి నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్కు 4.23 ఎకరాలు, అగ్నిమాపక శాఖకు రాయపూడి వద్ద 2 ఎకరాలు, డీఏవీ పాఠశాలకు నెక్కల్లు వద్ద 3 ఎకరాలు, ఆప్కాబ్కు 0.49 ఎకరాలు కేటాయింపులపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డు అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కేబినెట్ అభినందనలు తెలిపే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో డీజిల్ సమస్యపై కూడా చర్చ జరగనుంది.
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
-
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
-
AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!