Anushka Sharma: నా భర్తను చాలా మిస్సవుతున్నా.. అనుష్క ఎమోషనల్ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka Sharma: బాలీవుడ్ నటి అనుష్క శర్మ శనివారం తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి ఉన్న ఓ ఎమోషనల్ పోస్ట్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె చేసిన పోస్ట్ తాజాగా వైరల్గా మారింది. తన భర్తను చాలా మిస్సవుతున్నానని క్యాప్షన్ పెట్టింది. ఆ పోస్ట్లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకరికొకరు దగ్గరగా నిలబడి కెమెరాకు పోజులిచ్చారు. నటి అనుష్క శర్మ ప్రస్తుతం లండన్లో తన తదుపరి చిత్రం ‘చక్దా ఎక్స్ప్రెస్’ షూటింగ్లో ఉన్నారు. అదే సమయంలో, క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియాతో మొదటి టీ20 మ్యాచ్కు ముందు భారత క్రికెట్ జట్టుతో కలిసి శనివారం మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియానికి చేరుకున్నారు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 20న జరుగనుంది. కోహ్లీ మొహాలీలో, అనుష్క లండన్లో ఉండడంతో తన భర్తను మిస్సవుతున్నట్లు పోస్ట్ చేసింది. ”నా భర్తను చాలా మిస్సవుతున్నా.. ఈ ప్రపంచం మొత్తం అందంగా, ఉత్సాహంగా కనిపిస్తుంది. కానీ నాకు లోపల మాత్రం ఏదో తెలియని వెలితి ఉంది. నా హబ్బీని మిస్ అవుతున్నాననే ఫీలింగ్ నాలో కలుగుతుంది..” అంటూ పేర్కొంది అనుష్క. అయితే ఆ పోస్ట్కు స్పందించిన విరాట్.. లవ్ ఎమోజీ పెట్టాడు. టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవలే ముగిసిన ఆసియా కప్లో భారత్ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. అఫ్గానిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా సెంచరీతో మెరిసిన విరాట్.. ఫుల్ ఫామ్లోకి వచ్చేశాడు. ఆసియా కప్ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకున్న కోహ్లీ.. భార్య అనుష్క, కూతురు వామికతో కలిసి లండన్ టూర్ వెళ్లాడు. తాజాగా ఆసీస్తో టీ20 సిరీస్ నేపథ్యంలో భారత్కు వచ్చేశాడు.
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ20 హోమ్ సిరీస్ సెప్టెంబర్ 20న మొహాలీలో ప్రారంభం కానుంది. తదుపరి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 23న నాగ్పూర్లో జరగనుండగా, చివరి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 25న హైదరాబాద్లో జరగనుంది. ‘చక్దా ఎక్స్ప్రెస్’ గురించి చెప్పాలంటే, ఇది భారతీయ క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా రూపొందించబడిన స్పోర్ట్స్ బయోపిక్ చిత్రం, ఇది నెట్ఫ్లిక్స్లో ప్రత్యేకంగా ప్రసారం చేయబడుతుంది. ఈ చిత్రం యొక్క చివరి విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. అనుష్కశర్మ తన కెరీర్లో మొదటిసారిగా క్రికెటర్ పాత్రను పోషించనుంది. ఆమె 2022 ప్రారంభంలో ఒక ప్రత్యేక ప్రకటన వీడియోతో తన రాబోయే చిత్రాన్ని ప్రకటించింది. దేశంలోని ఔత్సాహిక క్రికెటర్లకు ఝులన్ రోల్ మోడల్. 2018లో ఆమె గౌరవార్థం భారతీయ తపాలా స్టాంపును విడుదల చేశారు.అంతర్జాతీయ కెరీర్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళగా ఝులన్ ప్రపంచ రికార్డు సృష్టించింది.
Also Read
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టంట్స్ చూశారా..?
అనుష్క తన మొదటి బిడ్డ, తన కుమార్తె వామికను స్వాగతించిన తర్వాత తన వృత్తి జీవితం నుండి సుదీర్ఘ విరామం తీసుకుంది. ఆమె తనతో సమయం గడపాలని కోరుకుంది. అనుష్క సోదరుడు కర్నేష్ శర్మ తన హోమ్ ప్రొడక్షన్ కంపెనీ క్లీన్ స్లేట్ ఫిలింస్తో కలిసి ‘చక్దా ఎక్స్ప్రెస్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!