Virat Kohli-Anushka Sharma: విరాట్ కోహ్లీకి కొత్త పేరు పెట్టిన అనుష్క శర్మ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka Sharma drops heartfelt post for Virat Kohli after IND vs NZ Match: ఐసీసీ ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లల్లో 273 పరుగులకు ఆలౌట్ అయింది. రచిన్ రవీంద్ర (75) హాఫ్ సెంచరీ చేయగా.. డారిల్ మిఛెల్ (130) సెంచరీ చేశాడు. భారత పేసర్ మహ్మద్ షమీ 5 వికెట్లతో సత్తాచాటాడు. ఆపై భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసి విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (95; 104 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు), రవీంద్ర జడేజా (39 నాటౌట్; 44 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
274 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (46), శుభ్మన్ గిల్ (26) ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డ్ను పరుగులెత్తించారు. ఈ ఇద్దరు వెంటవెంటనే అవుట్ అయినప్పటికీ.. విరాట్ కోహ్లీ క్రీజులో ఉండడంతో భారత్ ఫాన్స్ విజయంపై ధీమాగా ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఔట్ అవ్వడంతో భారం మొత్తం కోహ్లీపైనే పడింది. రవీంద్ర జడేజా అండతో విరాట్ టీమిండియాను విజయానికి చేరువ చేశాడు. అయితే 95 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మాట్ హెన్రీ బౌలింగ్లో భారీ షాట్ ఆడి గ్లెన్ ఫిలిప్స్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో 5 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు.
Also Read
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్లతో ఎక్స్లో పోస్టులు!
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
Also Read: Bajaj CNG Bike: దేశంలో తొలి సీఎన్జీ బైక్.. మైలేజీ, ధర డీటెయిల్స్ ఇవే!
విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ అయినా ఫాన్స్ మాత్రం తెగ సంబరపడిపోయారు. ఎందుకంటే వన్డే ప్రపంచకప్ 2023లో అతడు రెచ్చిపోయి ఆడుతున్నాడు. మెగా టోర్నీలో 5 మ్యాచులు ఆడిన విరాట్ 354 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు చివరి 13 ఇన్నింగ్స్లలో 779 పరుగులు చేశాడు. ఇందులో ఛేజింగ్ సమయంలోనే ఏక్కువగా పరుగులు చేశాడు. ఛేజింగ్ అంటే ఇష్టమని కోహ్లీ కూడా చాలాసార్లు చెప్పాడు. కివీస్ ఇన్నింగ్స్ అనంతరం కోహ్లీకి అతడి సతీమణి అనుష్క శర్మ ఓ నిక్ నేమ్ పెట్టారు. ‘స్టార్మ్ ఛేజర్’ అని అనుష్క తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ను షేర్ చేశారు. దీనికి కోహ్లీ ఫొటోను జత చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫాన్స్ కూడా కరెక్ట్ నిక్ నేమ్ పెట్టారని ట్వీట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్లతో ఎక్స్లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్పై ఉపాసన రియాక్షన్!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?