Terror Attack in Doda: జమ్మూకశ్మీర్లో ఆర్మీ పోస్ట్పై మరోసారి దాడి.. మూడు రోజుల్లో మూడోసారి..!
- దేశ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత..
- జమ్మూ కశ్మీర్లోని దోడాలో గల ఆర్మీ పోస్ట్పై మంగళవారం అర్థరాత్రి ఉగ్రవాదుల దాడి..
- మూడు రోజుల్లో మూడోసారి ఆర్మీ పోస్ట్పై ఉగ్రవాదుల దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు తరచూ దాడులకు దిగుతున్నారు. జమ్మూ కశ్మీర్లోని దోడాలో గల ఆర్మీ పోస్ట్పై మంగళవారం అర్థరాత్రి ఉగ్రమూకలు దాడి చేశాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు చెప్పారు. అయితే, ఈ కాల్పుల్లో ఇద్దరు జవానులు గాయపడినట్లు తెలుస్తుంది. దీనికి ముందు కథువా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే మరో ఉగ్రదాడి జరిగింది. అలాగే, మూడు రోజుల క్రితం ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్టు బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సమయంలో డ్రైవర్ వారి నుంచి తప్పించడంతో ఆ బస్సు లోయలో పడిపోయింది. అప్పుడు జరిగిన ఆ దాడిలో 9 మంది ప్రయాణికులు చనిపోగా, 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.
Read Also: Road Accident : ఇసుక ట్రక్కు గుడిసెపై బోల్తా.. నలుగురు పిల్లలతో సహా 8మంది మృతి
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
అయితే, మంగళవారం సాయంత్రం కతువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు (IB) సమీపంలోని ఒక గ్రామంపై దాడి చేసి ఒక పౌరుడిని గాయపరిచిన దాగి ఉన్న ఉగ్రవాదులను బయటకు తీయడానికి భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టారు. కతువా ఆపరేషన్లో పాకిస్థాన్కు చెందిన ఓ ఉగ్రవాది భద్రతా బలగాల చేతిలో హతమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. కథువా జిల్లాలోని చత్రగల ఏరియాలో నాలుగు రైఫిల్స్, పోలీసుల సంయుక్త పోస్ట్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆనంద్ జైన్ మీడియాకు వెల్లడించారు.
#WATCH | Jammu and Kashmir: Search operation underway in Bhaderwah, Doda as an encounter is underway between security forces and terrorists in Chattargala area of Doda.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/AyaBVYQDXR
— ANI (@ANI) June 12, 2024
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!