Manipur Shocker: మణిపూర్లో మరో షాకింగ్.. వ్యక్తి తలనరికి వేలాడదీసిన వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Shocker: ఇప్పటికే హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తలనరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్ తాజాగా వైరల్గా మారింది. మణిపూర్లో ఒక గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ అయి.. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. దానిని మరువక ముందే ఈ దారుణ సంఘటన జులై 2న బిష్ణుపూర్ జిల్లాలో చోటుచేసుకంది. అర్ధరాత్రి వేళ జరిగిన ఘర్షణలో కుకీ వర్గానికి చెందిన నలుగురిని మైతీ వర్గానికి చెందిన వారు దారుణంగా చంపారు. డేవిడ్ థీక్ అనే వ్యక్తి తల నరికి.. ఆ ప్రాంతంలో వెదురు కర్రలతో చేసిన కంచెకు అతడి తలను వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: Mamata Banerjee: బెంగాల్కు బృందాలను పంపిన కేంద్రం, మణిపూర్కు ఎందుకు పంపలేదు?
Also Read
- UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
- Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
- Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
- Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
మణిపూర్లో శుక్రవారం మే 4 న చిత్రించిన వీడియోలో మహిళలను నగ్నంగా ఊరేగించి, పురుషుల గుంపు పట్టుకున్నట్లు చూపడంతో కొత్త ఉద్రిక్తత నెలకొంది. మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో క్లిప్ ఈ నెల 19న సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియో వెలుగులోకి వచ్చిన ఒక రోజు తర్వాత నలుగురిని అరెస్టు చేశారు. హింసాకాండకు వ్యతిరేకంగా గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మే 4న జరిగిన ఈ అమానుష సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. గత రెండు రోజులుగా పార్లమెంట్ ఉభయ సభలను కూడా ఈ అంశం కుదిపేసింది. ఈ తరుణంలో కుకీ వ్యక్తి తల నరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్ వైరల్ కావడం మణిపూర్లో మరింతగా ఉద్రిక్తతలను రాజేస్తోంది.
Also Read: Cocaine: రికార్డు స్థాయిలో 5.3 టన్నుల కొకైన్ పట్టివేత.. విలువెంతో తెలిస్తే షాకవుతారు!
మణిపూర్ ఇంఫాల్ లోయలో ఉన్న మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ, కొండలలో ఉన్న గిరిజన కుకీల మధ్య మే నుండి జాతి ఘర్షణలు జరుగుతున్నాయి. మణిపూర్ లో చెలరేగుతున్న ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 160 మంది చనిపోయారు. ఇళ్లు దగ్ధం కావడంతో నిరాశ్రయులైన వేలాది మంది ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
https://twitter.com/ABSP2000/status/1682117216563765253
తాజావార్తలు
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!