బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ యానిమల్.. ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఊహకు అందని విధంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమా ఏ రేంజ్ లో భారీ విజయం సాధించిందోననే చర్చ ఇప్పటికి ఇండస్ట్రీలో జరుగుతుంది..
బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా, సౌత్ లోని అని భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయి మొత్తంగా రూ. 800 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక తాజాగా ముంబైలో మూవీ టీం ‘యానిమల్’ సక్సెస్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి రణబీర్ తన భార్య ఆలియా తో కలిసి రాగా.. మహేష్ భట్, నీతూ కపూర్, రష్మిక మందన్న, తమన్నా, త్రిప్తి దిమ్రి, బాబీ డియోల్, మానుషీ చిల్లర్, హిమేష్ రేష్మియా, ఆర్జీవీ, జెనీలియా, రితేష్ దేశ్ముఖ్.. తదితరులు ఈ గ్రాండ్ పార్టీకి హాజరయ్యి సందడి చేశారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
అయితే ఈ సక్సెస్ పార్టీకి రణబీర్ కపూర్ భార్య అలియా భట్ కూడా హాజరయ్యింది.. ఆలియా ధరించిన బ్లూ డ్రెస్స్ అందరి దృష్టిని ఆకర్శించింది.. కాగా ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల బట్టల గురించి .. వాటి ఖరీదు ఎంత అనే దాని పై జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో భాగంగా అలియా ధరించిన ఈ బ్లూ డ్రెస్ ఖరీదు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. దీని ధర తెలుసుకోవాలని చాలా మంది ఆరాట పడుతున్నారు కూడా.. నిజానికి ఈ డ్రెస్స్ ధర రూ. 1.5 లక్షలు అని తెలుస్తుంది… ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది…
